మొదటి రోజు వచ్చిన రివ్యూస్ చూస్తే సినిమా వర్క్ అవుట్ కాదేమో అనిపించింది కానీ ప్రేక్షకులు సినిమా ను ప్రేమించారు. ఒక్క క్షణం నాకు ఏం అర్ధం కాలేదు. ఆతరువాత ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నాను. తీరా చూస్తే సాహో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. నా కెరీర్ లో ఇప్పటివరకు హైయస్ట్ గ్రాసర్ మూవీ సాహో నే. దాన్ని బట్టి చెప్పొచ్చు ఈచిత్రాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారోనని శ్రద్దా వ్యాఖ్యానించింది.
అలాగే డైరెక్టర్ సుజీత్ గురించి స్పందిస్తూ ... క్రిటిక్స్ సుజిత్ ను ఏదో క్రైమ్ చేసినట్లు చూస్తున్నారు. వారు ఎవరు అతన్ని జడ్జ్ చేయడానికి .. టికెట్ కొనుక్కొని సినిమా ను చూసే ప్రేక్షకుడే నిజమైన బాస్ వారు చెపుతారు ఎలా ఉందోనని.. చివరగా సాహో ఫై ప్రేక్షకులు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు నేను ఇంకాఈ సినిమా చూడలేదు త్వరలోనే చూస్తాను అని శ్రద్దా కపూర్ వెల్లడించింది. ఇక ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 400కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. హిందీలో 155కోట్ల వసూళ్లతో హిట్ అనిపించుకోగా తెలుగు , తమిళ , మలయాళ భాషల్లో మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. కాగా ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం భారీ నష్టాలను మిగిల్చింది.