రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన  భారీబడ్జెట్ చిత్రం సాహో తో తెలుగులో  పరిచయం అయ్యింది బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్. అయితే విడుదలై  20రోజులవుతున్నా   ఇంతవరకు నేను సాహో చూడలేదని  అని చెప్పి షాక్ ఇచ్చింది శ్రద్దా .  తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో  ఆమె  సాహో గురించి స్పందించి  సంచలన వాఖ్యలు చేసింది.



మొదటి రోజు వచ్చిన రివ్యూస్  చూస్తే  సినిమా  వర్క్ అవుట్ కాదేమో అనిపించింది కానీ  ప్రేక్షకులు సినిమా ను  ప్రేమించారు. ఒక్క క్షణం  నాకు ఏం అర్ధం కాలేదు. ఆతరువాత ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నాను.  తీరా చూస్తే సాహో బాక్సాఫీస్ వద్ద  అద్భుతమైన  వసూళ్లను  రాబట్టింది.  నా కెరీర్ లో ఇప్పటివరకు  హైయస్ట్ గ్రాసర్ మూవీ సాహో నే. దాన్ని బట్టి చెప్పొచ్చు  ఈచిత్రాన్ని ప్రేక్షకులు  ఎలా రిసీవ్ చేసుకున్నారోనని  శ్రద్దా వ్యాఖ్యానించింది. 



అలాగే డైరెక్టర్ సుజీత్ గురించి స్పందిస్తూ ... క్రిటిక్స్ సుజిత్  ను ఏదో క్రైమ్  చేసినట్లు   చూస్తున్నారు. వారు ఎవరు అతన్ని జడ్జ్ చేయడానికి ..  టికెట్ కొనుక్కొని   సినిమా ను చూసే  ప్రేక్షకుడే నిజమైన బాస్  వారు చెపుతారు  ఎలా ఉందోనని..  చివరగా సాహో  ఫై ప్రేక్షకులు చూపించిన ప్రేమకు  ధన్యవాదాలు   నేను ఇంకాఈ సినిమా  చూడలేదు త్వరలోనే చూస్తాను అని  శ్రద్దా కపూర్ వెల్లడించింది. ఇక ఈ చిత్రం  ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా  400కోట్లకు పైగా  గ్రాస్ వసూళ్లను రాబట్టింది. హిందీలో 155కోట్ల వసూళ్లతో  హిట్ అనిపించుకోగా తెలుగు , తమిళ , మలయాళ భాషల్లో మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది.  కాగా ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం  భారీ నష్టాలను  మిగిల్చింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: