టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు మంచి హిట్ ఇచ్చిన ఏ దర్శకుడికైనా మరో ఛాన్స్ వెంటనే ఇస్తుంటారు. ఇలా మహేష్ బాబుతో గతంలో శ్రీను వైట్ల,పూరి జగన్నాథ్, కొరటాల శివ ఇలా ఎంతో మంది స్టార్ డైరెక్టర్ మహేష్ బాబు సూపర్ హిట్ సినిమాలు తీశారు. ఈ సంవత్సరం దర్శకుడు,నిర్మాత అయిన వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మేకింగ్ చాలా సమయం పట్టింది..దాంతో ఒకానొక దశలో నిరాశలో ఉన్న మహేష్ ఫ్యాన్స్ ఈ మూవీ రిలీజ్ తర్వాత మైండ్ బ్లోయింగ్ అనిపించింది.
ఈ మూవీలో మహేష్ బాబు గతంలో కనిపించని విధంగా స్మార్ట్ లుక్ తో కనిపించడమే కాదు..కాలేజ్ కుర్రాడిలా నటించి పూజా హెగ్డేతో రొమాన్స్ సీన్లు అదిరిపోయాయి. ఆ తర్వాత ఒక సామాన్య రైతుగా కనిపించాడు. ‘మహర్షి’మూవీలో మహేష్ బాబు మూడు రకాల వేరియేషన్స్ తో అదరగొట్టాడు. రైతులకు గౌరవం..వారు పడుతున్న కష్టాలు..వలసలు ఎందుకు వెళ్తుతున్నారు అన్న కోణంలో చిత్ర కథ సాగుతుంది. మొత్తానికి వంశి పైడిపల్లి-మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘మహర్షి’ రెండు వందల కోట్ల క్లబ్ లో చేరింది.
ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు ’ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు ఎవరి దర్శకత్వంలో నటిస్తున్నారన్న క్యూరియాసిటీ అభిమానుల్లో తలెత్తింది. జీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో మహేష్ తర్వాతి ప్రాజెక్ట్ ఉంటుందని కొందరు చెబుతుండగా, మరికొందరు మహర్షితో మహేష్కి మంచి హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లితో ఉంటుందని అంటున్నారు.
‘మహర్షి’లాంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన వంశి కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అభిమానులు భావిస్తున్నారు. వంశీ ఇప్పటికే మహేష్కి స్టోరీ లైన్ వినిపించాడని అది నచ్చడంతో స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలు పెట్టాడని విస్త్రృత ప్రచారం జరుగుతుంది. త్వరలో దీనిపై పూర్తి క్లారిటీ రానుంది. మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ వస్తే సూపర్ హిట్ అని అంటున్నారు ఫ్యాన్స్.