సినిమా ఇండస్ట్రీలో ఏ భాషలోనైనా ఒక మంచి హీరోయిన్ గా అవకాశాలు తెచ్చుకోవడమే చాలా కష్టం అనుకుంటారు. కానీ అవకాశాలు వచ్చినా కొంతమందికి సక్సెస్ అంత త్వరగా దక్కదు. అయితే కొంతమంది హీరోయిన్స్ మాత్రం రెండు మూడు సినిమాలు ఫ్లాప్, యావరేజ్ అయినా ఒక హిట్ ను తమ ఖాతాలో వేసుకుంటారు. కెరీర్ లో పైకి వెళ్ళేందుకు కొత్త దారి వేసుకుంటారు. నిధి అగర్వాల్ ఆ కోవకే చెందిన హీరోయిన్ అని చెప్పాలి. నిధి 'మున్నా మైఖేల్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తెలుగులో 'సవ్యసాచి'.. 'మిస్టర్ మజ్ను' సినిమాలు చేయగా ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచాయి. కాని 'ఇస్మార్ట్ శంకర్' తో ఓ సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.  

ఇస్మార్ట్ సక్సస్ తో నిధి 'ఐరన్ లెగ్' అన్న టాగ్ ను తుడిచేసుకుంది. వాస్తవంగా చూస్తే అందరూ 'ఇస్మార్ట్ శంకర్' పూరి జగన్నాధ్.. రామ్ లకు డౌన్ లో ఉన్న సమయంలో మంచి బ్రేక్ ఇచ్చిందని అనుకుంటున్నారు. కానీ నిధికి కూడా మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి. వరుసగా అక్కినేని హీరోలతో చేసిన రెండు సినిమాలు తనకు కలిసి రాలేదు. దాంతో ఇక నిధి కి తెలుగులో అవకాశాలు రావనే అనుకుంది. కానీ ఇస్మార్ట్ శంకర్ సక్సస్ తో ఇప్పుడు నిధికి తెలుగులో మంచి ఆఫర్లే వస్తున్నాయి. అంతేకాదు సోషల్ వెబ్ సైట్స్ లోను బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఎక్కడ చూసిన నిధి హల్‌చల్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటోంది. 

ఇక నిధి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే బాలీవుడ్ లో 'మాస్క్'.. 'ఇక్కా' అనే రెండు సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమాలు కాకుండా తెలుగులో కూడా పలు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయట. ముఖ్యంగా సాయి ధరం తేజ్ సినిమాలో నటించబోతోందని తెలుస్తోంది. అంతేకాదు ఇదే సినిమాలో నిధి తో కలిసి నటించిన నభా నటేష్ కూడా నటిస్తుందని రీసెంట్‌గా వార్త ఒకటి బాగా వైరల్ అవుతోంది. త్వరలోనే నిధి నటించబోయే నెక్స్ట్ టాలీవుడ్ ఫిలిం వివరాలు అఫీషియల్ గా వెల్లడవుతాయని లేటెస్ట్ న్యూస్.



మరింత సమాచారం తెలుసుకోండి: