టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు కెరీర్ లో తొలిసారి మిలిటరీ మేజర్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుండగా, ఒకప్పటి సీనియర్ నటి విజయశాంతి ఈ సినిమా ద్వారా మళ్ళి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. మరొక నటి సంగీత మరియు ప్రముఖ కమెడియన్ బండ్ల గణేష్ కూడా ఈ సినిమా ద్వారా రీఎంట్రీ ఇవ్వడం విశేషం. మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర  సంయుక్తంగా అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నట్లు సమాచారం. 

ఇక ఈ సినిమా విషయమై రెండు రోజుల క్రితం, నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర తన సోషల్ మీడియా మాధ్యమాల్లో పెట్టిన ఒక పోస్ట్, కొద్దిపాటి చిన్న సమస్యలకు తెరలేపింది. ఆగడు సినిమా రిలీజ్ సమయంలో వచ్చిన హైప్ అంతా ఇంతా కాదనేది అందరికి తెలిసిందే, ఇక అప్పట్లో ఆ సినిమా ప్రీమియర్ల రూపంలో ఓవర్సీస్ లో ఐదులక్షల డాలర్లు వసూలు చేసిన సినిమాగా పెద్ద రికార్డు ని నెలకొల్పింది. అయితే ఇటీవల ఒక సూపర్ స్టార్ అభిమాని, మహేష్ బాబు పోస్టర్ కు అప్పట్లో ఆగడు రిలీజ్ టైములో డాలర్ల దండ వేసి ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా, 

అనిల్ దానిని రీట్వీట్ చేస్తూ, మన సరిలేరు నీకెవ్వరు కు ఇటువంటి హైప్ కావాలని, అయితే దూకుడు మాదిరిగా ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఈ విషయమై కొందరు లేనిపోని అపోహలు సృష్టిస్తూ, ఆగడు ఫ్లాప్ సినిమా కదా, మరి అనిల్ అనిల్ గారు ఆ విధంగా సరిలేరు కూడా ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నారా అంటూ సోషల్ మీడియా వేదికల్లో అనుమానపు ప్రచారాలు చేయడంతో, దీనిపై ఆయన వివరణ ఇచ్చారు అనిల్. తాను చెప్పింది ఆగడు సినిమా మాదిరిగా సరిలేరు నీకెవ్వరుకు కూడా మంచి హైప్ రావాలని, అలానే దూకుడు సినిమా మాదిరిగా ఇది కూడా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నట్లు మరొక పోస్ట్ ద్వారా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే దూకుడు సినిమా అంటే, అచ్చం దూకుడుని కాపీ చేసినట్లు కాదు, ఆ సినిమా మాదిరి మంచి కమర్షియల్ కంటెంట్ తో అనేది తన భావన అని కూడా అనిల్ తెల్పడం జరిగింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: