బిగ్ బాస్ లో శుక్రవారం ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది.  కంటెస్టెంట్స్ ని కలుసుకోవడానికి వచ్చిన కుటుంబ సభ్యులకు టాస్క్ ఇవ్వడం కొత్తగా అనిపించింది. అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఆ కుటుంబ సభ్యులు సరిగా పూర్తి చేయనందున అదృష్టం ఆధారంగా కంటెస్టెంట్స్ ని కలిసే వీలు కల్పించాడు. మొత్తానికి  వితికా, రవిక్రిష్ణలు మాత్రమే తమ కుటుంబ సభ్యులను కలుసుకోగలిగారు.


ఎప్పుడూ కంటెస్టెంట్స్ కి టాస్క్ లు ఇచ్చే బిగ్ బాస్ వారి కుటుంబ సభ్యులకి టాస్క్ ని ఇచ్చి అందరినీ ఆశ్చర్య పరిచాడు.  అయితే బిగ్ బాస్ కుటుంబ సభ్యులకు ఇచ్చిన టాస్క్ ని పరిశీలిస్తే, తమ కంటెస్టెంట్స్ టాప్ లో ఉండాలను ఎందుకు అనుకుంటున్నావో అవతలి వారికి చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయాలని చెప్తాడు. అయితే ఇక్కడ కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు కొన్ని పొరపాట్లు చేసినట్లు తెలుస్తుంది. మొత్తం ఐదుగురు కుటుంబ సభ్యులు ఒకే పొరపాటు చేశారు.


కుటుంబ సభ్యులు తమ కంటెస్టెంట్ పలు కారణాల వల్ల  టాప్ లో ఉంటాడని చెప్పడం మానేసి మిగతా కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకోవడమే వింతగా అనిపించింది. అందరూ ముక్తకంఠంతో వరుణ్ సందేశ్ ని టాప్ లో ఉంచాలని డిసైడ్ అయ్యారు. వాళ్ళ వాదన చూస్తుంటే వరుణ్ ని టాప్ వన్ లో ఉంచి, సెకండ్ ప్లేస్ కోసమే వాళ్ల కంటెస్టెంట్స్ పోరాడాలనే తప్పుడు సందేశాన్ని వాళ్ళకి అందించినట్టుగా ఉంది.


అయితే ఇక్కడ వరుణ్ ఎందుకొచ్చాడో అర్థం కాలేదు. వరుణ్ మంచివాడే కావచ్చు. కానీ అతను ఏ ప్లేస్ లో ఉంటాడనే డిస్కషన్ అనవసరం. వరుణే కాదు మహేష్ గురించి కూడా అనవసరంగా మాట్లాడుకున్నారు. తమ కుటుంబ సభ్యులు గెలవాలనుకుంటే బాగుంటుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి బిగ్ బాస్ లో ఒక ఎమోషనల్ రైడ్ పూర్తయిందనే చెప్పవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: