టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇటీవల రిలీజ్ అయిన ఆయన 25వ సినిమా మహర్షి అత్యద్భుత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన  ఆ సినిమాలో మహేష్ బాబు, మూడు రకాల షేడ్స్ ఉన్న రిషి అనే యువకుడి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. ఇక ఆ సినిమా తరువాత మహేష్ నటిస్తున్న 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తన కెరీర్ లో ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్  కూడా లేని అనిల్ రావిపూడి, 

సూపర్ స్టార్ ని దర్శకత్వం వహించే ఈ అవకాశాన్ని ఏ విధంగా వినియోగించుకుంటరు అనే దానిపై సూపర్  స్టార్ ఫ్యాన్స్ తో పాటు, సాధారణ ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమా తరువాత మహేష్ నటించబోయే 27వ  సినిమాకు సంబంధించి కొద్దిరోజుల నుండి పలు వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. ఆయన సందీప్ రెడ్డి వంగ, పరశురామ్, ప్రశాంత్ నీల్ తో చేస్తున్నారు అంటూ ఇప్పటివరకు వార్తలు రాగా, నేడు మరొక దర్శకుడి పేరు టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా హల్ చల్ చేస్తోంది. ఆయనే పూరి జగన్నాథ్, గతంలో సూపర్ స్టార్ తో పోకిరి, బిజినెస్ మ్యాన్ సినిమాలు తెరకెక్కించిన పూరి, ముచ్చటగా మూడోసారి సూపర్ స్టార్ తో పనిచేయాలని ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాడు. 

అయితే ఆయన ఆశ ఇప్పటికి నెరవేరునట్లు సమాచారం. రెండు రోజుల క్రితం మహేష్ ను పూరి కలిసి ఒక కథ వినిపించడం జరిగిందని, ఆ కథ మహేష్ ను ఎంతో ఇంప్రెస్ చేసిందని టాక్. అంతేకాదు, వీలైనంత త్వరగా సినిమాను మొదలెడదాం అని అన్నారట. అయితే తాను విజయ్ తో తీయబోయే సినిమా వచ్చే ఫిబ్రవరి నాటికి ముగుస్తుందని, ఆ వెంటనే మన సినిమాను మొదలెడదాం అని పూరి కూడా మాటిచ్చినట్లు చెప్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రటకన మాత్రం వెలువడవలసి ఉంది. మరి మొన్న ఆ మధ్య మహేష్ పై సంచనలన కామెంట్ చేసి వార్తలకెక్కిన పూరి, ఇలా సడన్ గా నిజంగానే మహేష్ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారా అనే దానిపై నిజానిజాలు వెల్లడైతేనే కానీ ఈ వార్తను నమ్మలేం అంటున్నారు సినీ విశ్లేషకులు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: