టాలీవుడ్ ఈ మద్య ఎంతో మంది కొత్త హీరోయిన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అందులో కొంతమంది సక్సెస్ అవుతున్నా..కొంతమంది కంటికి కూడా కనిపించకుండా పోతున్నారు. అయితే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు కావొస్తున్నా ఇప్పటికీ వన్నెతగ్గని అందాల సుందరి కాజల్ అగర్వాల్.  టాలీవుడ్ లో తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన కాజల్ అతి తక్కువ కాలంలోనే తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో టాప్ హీరోలతో నటించింది.

ప్రస్తుతం ఈ అమ్మడి స్పీడ్ కాస్త తగ్గినా..యేడాదికి ఒకటీ రెండు సినిమాలు మాత్రం ఖాయం. ‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత కీర్తి సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటోంది. తెలుగు, తమిళ చిత్రాలతో బాటు హిందీలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ  మద్య తెలుగు లో కీర్తి ఓ సినిమాకి నో చెప్పారని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.రానా హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో  పోలీస్‌ పాత్ర కోసం కీర్తి సురేశ్‌ను సంప్రదించారట.

వరుస సినిమాల వల్ల డేట్స్‌ కుదరకపోవడంతో ఆమె ఈ సినిమాకి నో చెప్పినట్లుగా తెలుస్తోంది. తెలుగులో మిస్ ఇండియా, మలయాళంలో మోహన్ లాల్ సినిమా, తమిళంలో ఓ మూవీ, హిందిలో 'మైదాన్' సినిమాలతో కీర్తి బిజీగా ఉంది.  ఈ నేపథ్యంలో రానాకి నో చెప్పిందని వార్తలు వచ్చాయి. ఈ మూవీ 'మిస్ గ్రానీ' రీమేక్ గా తెలుగులో వచ్చిన చిత్రం 'ఓ బేబీ' .సమంత ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాకి నందినిరెడ్డి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మించింది.

ఈ సినిమా హిట్ కావడంతో తదుపరి అవకాశం రానా, నందిని రెడ్డికి ఇచ్చాడు. అయితే రానా సరసన హీరోయిన్ గా కీర్తి నో చెప్పడంతో చిత్ర యూనిట్ హీరోయిన్ వెతుకులాటలో ఉంది. దాంతో రానా సరసన కాజల్ అయితే సెట్ అవుతుందని భావించారట..తంలో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో వీరి పెయిర్ కు మంచి మార్కులే పడ్డాయి. అందుకే వీరి కాంబినేషన్ ను మరో మారు సెట్ చేశారని తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: