టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు, అనిల్ సుంకర, దిల్ రాజు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే నలభై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను సంక్రాంతి 2020 కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇకపోతే ఈ సినిమా ద్వారా సీనియర్ నటి విజయశాంతి, మరొక నటి సంగీత, 

నటుడు మరియు నిర్మాతైన బండ్ల గణేష్ టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించి పాటల రచయితగా పనిచేస్తున్న రామజోగయ్య శాస్త్రిగారు, కాసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్ లో పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. అదేమిటంటే, ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న దేవిశ్రీప్రసాద్ ఈ సారి సాంగ్స్ ఇరగదీశారు, అభిమానులందరికీ పాటలు విపరీతంగా నచ్చుతాయి అంటూ రామజోగయ్య గారు తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఇక ఆయన పోస్ట్ పెట్టిన వెంటనే సూపర్ స్టార్ ఫ్యాన్స్ దానిని విపరీతంగా వైరల్ చేస్తూ తెగ ఉప్పొంగిపోతున్నారు. 

అయితే గతంలో మహేష్, దేవిశ్రీ కాంబినేషన్లో వచ్చిన భరత్ అనే నేను, మహర్షి సినిమాల సాంగ్స్  ఆడియన్స్ ని ఆకట్టుకున్నప్పటికీ, ఇన్ స్టెంట్ చాట్ బస్టర్ అనే రేంజ్ లో అయితే పెద్దగా లేవు అనే విమర్శలు చక్కర్లు కొట్టాయి. అందువలన ఈసారి చేయబోయే ఈ సరిలేరు నీకెవ్వరూ సాంగ్స్ అదిరిపోతాయని దేవిశ్రీ, సినిమా ప్రారంభోత్సవం నాడు మాటివ్వడం జరిగింది. అంటే ఆయన మాటిచ్చిన మాదిరిగానే పాటలు ఇరగదీసినట్లుగా ఇప్పుడు రామజోగయ్యారు చెప్తున్న దానిని బట్టి అర్ధం అవుతోంది. ఇక నేడు ఆయన ట్వీట్ తో సరిలేరు నీకెవ్వరు పై అంచనాలు మరింతగా పెరిగాయనే చెప్పాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: