ఈ చిత్రం తరువాత షాహిద్ జెర్సీ రీమేక్ లో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఒరిజినల్ వెర్షన్ లో నాచురల్ స్టార్ నాని నటించగా సమ్మర్ లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొంది మంచి విజయాన్ని సాధించింది. దాంతో ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు ఓ బాలీవుడ్ బడా నిర్మాత తో కలిసి హిందీ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రీమేక్ లో షాహిద్ కపూర్ నటించడానికి అంగీకరించాడట.
ఈచిత్రం కోసం షాహిద్ ఏకంగా 35కోట్ల రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నాడని బాలీవుడ్ మీడియా వెల్లడించింది. ఇక ఈ చిత్రంలో షాహిద్ కు జోడీగా కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈరీమేక్ గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలుబడలేదు.