యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది కానీ ఆ అంచనాలను అందుకోవడం లో వెనకబడింది. శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కి సుజీత్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా దాదాపు 424 కోట్ల వసూళ్లు సాధించింది. కాని హిందీ ప్రేక్షకుల నుండి సినిమాకి మంచి ఆదారణ లభించింది. హిందీ వర్షన్ దాదాపుగా 153 కోట్ల వసూళ్లు సాధించింది.సాహో సినిమా హిందీ లో తప్ప రిలీజ్ అయిన అన్నిచోట్ల నష్టాలను మూటగట్టుకుంది.
ప్రభాస్ ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాడు. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం లో నటిస్తున్నాడు. ఈ సినిమా కు "జాన్" అనే పేరును అనుకుంటున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.1960 యూరప్ బ్యాక్ డ్రాప్ లో జరిగే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనుంది.గోపి కృష్ణ మూవీస్ మరియు యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం దాదాపుగా 150 కోట్ల భారీ బడ్జెట్ ని కేటాయించారని సమాచారం.
ఈ సినిమా దాదాపుగా 20 రోజుల షూటింగ్ జరుపుకుంది. ప్రభాస్ త్వరలోనే షూటింగ్ లో జాయిన్ అవుతాడు. ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురించిన కథానం ప్రకారం ప్రభాస్ దర్శకుడు రాధాకృష్ణను కథలో కొన్ని మార్పులు చేయమన్నాడట.తెలుగులో సాహో సినిమా సరిగా ఆడలేదు కానీ హిందీ లో మంచి విజయం సాధించింది. కాబట్టి హిందీ ప్రేక్షకులకు తగ్గట్టుగా సినిమాలో మార్పులు చేయమని కోరాడట.ఇంధులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు.ప్రభాస్ "జాన్" సినిమా కోసం కఠినమైన డైట్ లో ఉన్నాడు. కొత్త లుక్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు.