సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఇప్పుడు బయటకు చెప్పుకోలేని ఒక టెన్షన్ వెంటాడుతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. మహేష్ సినిమాలకు సక్సస్ లు వస్తున్నా అతడి మార్కెట్ కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అవుతూ అతడి రేంజ్ దక్షిణాది రాష్ట్రాలను కానీ అదేవిధంగా బాలీవుడ్ ను కాని చేరుకోలేకపోవడం మహేష్ కు ఒక సమస్యగా మారింది అని అంటున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల లిస్టులో మహేష్ కొనసాగుతున్నప్పటికీ ప్రభాస్ ఇప్పటికే నేషనల్ స్టార్ గా మారిపోవడంతో పాటు త్వరలో ‘ఆర్ ఆర్ ఆర్’ తో చరణ్ జూనియర్లకు కూడ నేషనల్ స్టార్ ఇమేజ్ రాబోతూ ఉండటంతో ఈ విషయంలో తాను వెనకపడి ఉన్నందుకు మహేష్ కలత చెందుతున్నట్లు టాక్. వాస్తవానికి ఇలాంటి నేషనల్ ఇమేజ్ కోసం మహేష్ రాజమౌళితో సినిమా చేయాలని ప్రయత్నించినా ఆ ప్రాజెక్ట్ ఎప్పటికి మొదలు అవుతుందో మహేష్ కే తెలియని పరిస్థితి అని అంటున్నారు. 

దీనితో మహేష్ తనకు నేషనల్ స్టార్ ఇమేజ్ ఇవ్వగల ఒక మంచి దర్శకుడు కోసం తీవ్ర అన్వేషణలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఇలాంటి ఇమేజ్ కోసం మురగదాస్ తో ‘స్పైడర్’ మూవీని చేసి మహేష్ తీవ్రంగా పరాభవం పాలయ్యాడు. దీనితో మళ్ళీ ఇప్పుడు మహేష్ చూపులు తనకు నేషనల్ స్టార్ ఇమేజ్ ఇస్తూ బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వగల దర్శకుడు వైపు అన్వేషణలు కొనసాగుతున్నాయి. 

ఇలాంటి ఆలోచనలతోనే ఈమధ్య మహేష్ ‘కేజీ ఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సమావేశం అయినప్పటికీ ఆ సమావేశంలో మహేష్ కోరుకున్న ఫలితాలు రాలేదని సమాచారం. దీనితో మహేష్ కు నేషనల్ స్టార్ ఇమేజ్ తీసుకు రాగల దర్శకుల అన్వేషణలో నమ్రత చాల బిజీగా ఉంటూ ఈ విషయాన్ని చాల సీరియస్ గా తీసుకుంటున్నట్లు సమాచారం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: