సినిమా రిలీజ్ డేట్ దగ్గరికి వస్తున్న సమయంలో ఈ గొడవ సైరా టీమ్కి తలనొప్పిగా మారే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక అసలు విషయానికి వస్తే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర గురించి వివరాలు చెప్పినందుకు ఉయ్యాలవాడ వంశస్థులు రాయల్టీగా డబ్బులు అడిగారు అని, మనిషికి కి 15 లక్షల వరకు ఇవ్వడానికి రామ్ చరణ్ అండ్ చిరంజీవి ఒప్పుకున్నారు అని గతంలో కూడా వార్తలు వచ్చాయి. కానీ తరువాత సినిమా గురించి, దాని బడ్జెట్ గురించి వార్తలు రావడంతో ఈ మొత్తం వ్యవహారంలో మధ్యవర్తులుగా ఉన్న ఇద్దరు ఉయ్యాలవాడ వంశస్థులని రెచ్చగొట్టి మనిషికి 50 లక్షలు అడగమని చెప్పడంతో కూల్గా సెటిల్ అవ్వాల్సిన మ్యాటర్ కాస్త ఇలా రచ్చ రచ్చగా మారింది అని ఫిల్మ్ నగర్ అనుకుంటుంది.
అలా అనుకున్నదానికంటే చాలా ఎక్కువ అడగడంతోనే సైరా నిర్మాతలు అనుకున్న అమౌంట్ కూడా ఇవ్వకుండా ఆపారు అని అందరు అనుకుంటున్నారు.అయితే ఇపుడు ఈ వివాదం కేసులవరకు వెళ్ళింది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా 'సైరా' సినిమా విడుదల పూర్తిగా సిద్దమయింది. అయితే ఆ సినిమా కథకు తమ నుండి వివరాలు అడిగి తీసుకుని సినిమా తీశారు కాబట్టి తమకు ఏకంగా 50 కోట్లు ఇవ్వాలి అని ఉయ్యాలవాడ వంశస్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఉయ్యాలవాడ వంశంలోని అయిదో తరానికి సంబంధించిన 23 మంది కలిసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 'సైరా' నిర్మాత రామ్ చరణ్ పై, చిరంజీవిపై కూడా కేసు పెట్టారు వంశస్థులు . ఆ కథకి 50 కోట్లు అనేది సాధారమణమైన డిమాండ్ కాదు, కానీ మరొక పక్క 'సైరా'కి సంబందించిన పెండింగ్ వర్క్ పూర్తిచేసుకుని సినిమా ప్రొమోషన్స్ కూడా మొదలుపెటాల్సి ఉంది. మరి ఈ వివాదాన్నినుంచి చిరంజీవి,రామ్ చరణ్ ఎలా సేవ్ అవుతారో చూడాలి. ప్రస్తుతం అయితే 'సైరా నరసింహారెడ్డి' ప్రీ రిలీజ్ ఫంక్షన్ హడావిడిలో ఉన్నారు.