టాలీవుడ్ లో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా సరే దర్శకుడు సంపత్ నంది మాత్రం ఒక హీరోయిన్ ను రిపీట్ చేస్తుంటాడు. సంపత్ నంది మొదటి సినిమా ఏమైంది ఈవేళ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో రచ్చ సినిమా చేశాడు. ఆ సినిమా నుండి గౌతం నంద వరకు చేసిన సినిమాల్లో తమన్నాని రిపీట్ చేస్తూ వచ్చాడు.


ఇక లేటెస్ట్ గా మరోసారి గోపిచంద్ తో సినిమా చేస్తున్నాడు సంపత్ నంది. ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నాని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. రచ్చ సినిమా టైంలో టాలీవుడ్ కు మరో క్రేజీ మాస్ డైరక్టర్ వచ్చాడని అనుకున్నారు. కాని ఆ తర్వాత బెంగాల్ టైగర్ పర్వాలేదు అనిపించినా గౌతం నంద మాత్రం సంపత్ నంది ఇమేజ్ డ్యామేజ్ చేసింది.


అయినా సరే కొద్దిపాటి గ్యాప్ తో మాచో హీరో గోపిచంద్ తో సినిమా చేస్తున్నాడు సంపత్ నంది. గౌతం నంద సినిమా స్టోరీ లైన్ పాతదే కాని సంపత్ మేకింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. ఆ టైంలో వేరే సినిమాలు వచ్చే సరికి సినిమా ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం గోపిచంద్ కెరియర్ కూడా ఆశించిన స్థాయిలో లేదు. అందుకే సంపత్ నందితో చేతులు కలిపాడు.


ఇక ఈ కాంబినేషన్ లోని సినిమాకు హీరోయిన్ గా తమన్నాని సెలెక్ట్ చేయడం విశేషం. తమన్నా ఆల్రెడీ ఇప్పటికి మంచి ఫాం లో ఉంది ఈ ఇయర్ ఎఫ్-2తో హిట్ తో కొట్టిన మిల్కీ బ్యూటీ సంపత్ నంది సినిమాతో మరోసారి లక్కీ ఛాన్స్ అందుకుంది. ఈమధ్య తమన్నా కూడా గ్లామర్ విషయంలో అసలేమాత్రం తగ్గట్లేదు. సంపత్ నంది సినిమాలో తమన్నా అదరగొట్టడం ఖాయమని అంటున్నారు. ఈ అక్టోబర్ లో చాణక్యగా రాబోతున్న గోపిచంద్ ఈ సినిమాతో పాటుగా సంపత్ నంది సినిమాతో హిట్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: