టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘నాపేరు సూర్య’ దారుణమైన డిజాస్టర్ తరువాత మరొక సినిమా ఒప్పుకోవడానికి చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని చివరాకరికి గతంలో తనకు రెండు సార్లు బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం వీరిద్దరి కలయికలో వస్తున్న ‘అలా వైకుంఠ‌పుర‌ములో’ అనే సినిమా పై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. ఎలాగైనా ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి డైరెక్టర్ త్రివిక్రం అల్లుఅర్జున్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.


ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో రెండు సినిమాలకు అల్లుఅర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు స్పీడ్ పెంచినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. ఇదిలా ఉండగా ఒకవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూనే మరో వైపు ఓ పాన్ ఇండియా ఫిల్మ్‌ను, ఓ బైలింగ్వల్ మూవీనికూడా ప్లాన్ చేస్తున్నాడట బన్నీ. ఈ నేపథ్యంలో… పాన్ ఇండియా ఫిలిం కోసం బన్నీ ఇప్పటికే కొంతమంది బాలీవుడ్ దర్శకులతో చర్చలు జరుపుతున్నాడని వార్త‌లు వినిపిస్తున్నాయి. అలాగే… తెలుగు, తమిళ భాషల్లో చేయనున్న బైలింగ్వల్ మూవీ కోసం టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ కుమార్‌తో సంప్రదింపులు జరుపుతున్నాడని టాక్.


అయితే… అట్లీ ప్రస్తుతం విజయ్ హీరోగా నటిస్తున్న ‘బిగిల్’ సినిమాతో బిజీగా ఉన్న కార‌ణంగా… వచ్చే ఏడాది బన్నీతో సినిమా చేసే సూచనలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ ను బన్నీ హోమ్ బ్యానర్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ప్రస్తుతం మాత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న ‘అలా వైకుంఠ‌పుర‌ములో’ అనే సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు బన్నీ. ఈ సినిమాని రాబోయే సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: