నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి ఎంతో అభిరుచితో నిర్మించిన సినిమా 'అ!'. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. 'అ!' సినిమాతో వినూత్నమైన సినిమాలను తెరకెక్కిస్తాడని ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న ప్రశాంత్ లేటెస్ట్ గా రాజశేఖర్ తో 'కల్కి' తీసిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే కాకుండా రాజశేఖర్ కి మంచి కమర్షియల్ సక్సస్ ను తెచ్చిపెట్టింది. దీంతో ప్రశాంత్ తీసిన రెండు సినిమాలకు మంచి పేరుతో పాటు డైరెక్టర్ గా క్రేజ్ ని కూడా సంపాదించుకున్నాడు. ఇప్పుడు ప్రశాంత్ అక్కినేని అఖిల్ తో మూడో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడని తాజా సమాచారం. ఇటీవలే నాగ చైతన్య కి ఓ కథ వినిపించిన ప్రశాంత్ ఆ కథను చైతూ బిజీగా ఉండటం వల్ల అఖిల్ తో చేస్తాడని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నాడు. లేటెస్ట్ గా అఖిల్, ప్రశాంత్ కి మధ్య కథా చర్చలు కూడా జరిగాయని ఫ్రెష్ అప్‌డేట్.

ఇక 'కల్కి' తర్వాత వాస్తవంగా ప్రశాంత్ వర్మ కాజల్ అగర్వాల్ తో ఓ సినిమా చేయాలి. వీరిద్దరి మధ్య కూడా స్టోరీ డిస్కర్షన్స్ జరుగుతున్నాయి. కాజల్ సొంత బ్యానర్ లో ఓ ఫిమేల్ సెంట్రిక్ సినిమాకు సన్నాహాలు కూడా జరిగాయి. కానీ కాజల్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న 'ఇండియన్ 2' లో నటిస్తుంది. ఆ సినిమా కోసం బల్క్ డేట్స్ ను కేటాయించింది. అందుకే ప్రశాంత్ తో సినిమా కాస్త డిలే అవుతోంది. 

అందుకే కాజల్ కంటే ముందే అఖిల్ తో సినిమా తెరకెక్కించాలని ప్రశాంత్ వర్మ ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతానికి అఖిల్ ఐదో సినిమా ఎవరితో అన్నది కూడా ఇంకా డిసైడ్ కాలేదు. బొమ్మరిల్లు భాస్కర్, అఖిల్ సినిమా తర్వాతే ప్రశాంత్ వర్మ తో సినిమాపై క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం నెక్స్ట్ సినిమాల కోసం కథలు రెడీ చేసే పనిలో ప్రశాంత్ వర్మ & టీం ఉందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను అన్నపూర్ణ బ్యారలో నిర్మిస్తారా..లేక నాని అఖిల్ కోసం మరోసారి నిర్మాతగా మారతాడా చూడాలి.   


మరింత సమాచారం తెలుసుకోండి: