మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా సైరా నరసింహారెడ్డి. దాదాపుగా రూ. 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి, సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెంచాయి. మెగాస్టార్ సరసన నయనతార జోడి కడుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కన్నడ స్టార్ సుదీప్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, జగపతిబాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న రాత్రి హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియం లో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. 

మధ్యలో కాస్త వర్షం కురిసినప్పటికీ, ఆ తరువాత వరుణ దేవుడు కరుణించడంతో ఫంక్షన్ సజావుగా సాగింది. ఇకపోతే ఈ సినిమా ఫంక్షన్ కు విచ్చేసిన మెగాస్టార్ బావమరిది అయిన అల్లు అరవింద్, సైరా విషయమై తన అనుభవాలు మెగా ఫ్యాన్స్ తో పంచుకున్నారు. అయితే ఆయన మైక్ అందుకుని మాట్లాడుతున్న సమయంలో ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా గోల చేస్తూ వద్దు వద్దు మీరు మాట్లాడొద్దు అంటూ చేతులు అడ్డంగా ఊపసాగారు, మొత్తానికి చివరికి మెగాస్టార్ కలుగచేసుకుని, అరవింద్ గారిని మాట్లాడనివ్వండి అని చెప్పగానే ఫ్యాన్స్ అందరూ శాంతించారు. అయితే ఆ విధంగా ఫ్యాన్స్ అరవింద్ ను అడ్డగించడానికి కారణం, 

అప్పటికే అక్కడ వర్షం పడుతుండడంతో, మిగతా వ్యక్తులు కనుక ఎక్కువసేపు మాట్లాడితే చివరకు పవర్ స్టార్, మెగాస్టార్ ల మాటలు ఎక్కువసేపు వినలేమని భావించే ఫ్యాన్స్ ఆ విధంగా చేసినట్లు మనకు అర్ధం అవుతుంది. ఇక అరవింద్ మాట్లాడుతూ, సైరా టీమ్ కాకుండా ఆ సినిమాను వీక్షించిన ఒకే ఒక వ్యక్తిని నేనే అని, నిజంగా సినిమా చూసిన తరువాత మెగాస్టార్ గారిని హృదయానికి హత్తుకోవాలని అనిపించిందని, అలానే ఇంతటి గొప్ప సినిమాను నిర్మించిన రామ్ చరణ్ కు కృతజ్ఞతలు చెప్పాలని కూడా అనింపించిందని అన్నారు. ఎందుకంటే తన కెరీర్లో చిరు గారితో ఎన్నో సినిమాలు నిర్మించినప్పటికీ, ఇంతటి అత్యద్భుతమైన సినిమాకు నిర్మాత కావడం నిజంగా చరణ్ చేసుకున్న అదృష్టమని ఆయనని కొనియాడారు......!!


మరింత సమాచారం తెలుసుకోండి: