సైరా నరసింహారెడ్డి  పాన్ ఇండియా మూవీ. టాలీవుడ్ సత్తా చాటే మరో గొప్ప చిత్రం. బాలీవుడ్ చూపులు ఇపుడు తెలుగు సినిమా మీద మరో మారు పడేలా  చేస్తున్న మూవీ. మెగాస్టార్ నలభై ఒక్క ఏళ్ల అనుభవాన్ని ఫణంగా పెట్టి తీసిన ఈ మూవీ చరిత్ర స్రుష్టిస్తుందని అంతా భావిస్తున్నారు. ఆలిండియా లెవెల్లో ఈ మూవీ రిలీజ్ కి డేట్ దగ్గరపడుతోంది.


మరో వైపు సైరా ప్రమోషన్ ఇంకా జోరు అందుకోలేదు. ఎంతసేపు చిత్ర కధానాయ‌కుడు చిరంజీవి మాత్రమే కనిపిస్తున్నారు. ఈ మూవీలో దిగ్గజ నటులు నటించారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది బిగ్ బి అమితాబ్ గురించి.  ఆయన ఈ మూవీలో నరసింహారెడ్డి గురువు పాత్రలో కనిపిస్తారు. బిగ్ బి ని పెట్టుకున్న ఉద్దేశ్యం ఆయన వల్ల బాలీవుడ్లో హైప్ క్రియేట్ అవుతుందని. అయితే బిగ్ బీ మాత్రం ఎక్కడా ప్రమోషన్లో పాలు పంచుకోవడంలేదు.


ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయ‌ని చెబుతున్నారు. దాంతో సైరా బిగ్ బి జోష్ కొంత తగ్గిందని భావించాలి. ఇక తమిళనాడు, కర్నాటక, మళయాళంలో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. సౌత్ అంతా గ్లామర్ బాగా  ఉన్న నయనతార ఈ మూవీ ప్రమోషన్లో ఎక్కడా కనిపించకపోవడం మరో లోటు. ఆమె ప్రతి సినిమా మాదిరిగానే ఈ మూవీ విషయంలోనూ చేస్తున్నారని అంటున్నారు.


అలాగే ఈ మూవీలో మరో కీలకపాత్ర  పోషించిన విజయ్ సేతుపతి కూడా ప్రమోషన్లో పాల్గొంటే సౌత్ లో మరింత ఎక్కువగా ప్రచారం వూపందుకుంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా సైరా మూవీ విషయంలో ఎన్నో ఆశలు అంతా పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ప్రమోషన్లో అంతా కలసి ఉంటే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది. సైరాకు సాయంగా అందరినీ ఒక్కటిగా చేసే బాధ్యత చిత్ర నిర్మాత  రాం చరణ్ మీద ఉందిపుడు.


మరింత సమాచారం తెలుసుకోండి: