కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా 'సైరా నరసింహా రెడ్డి'. ఈ మూవీ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. అమితాబ్ బచ్చన్, తమన్నా, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఆదివారం సాయంత్రం సైరా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరిగింది. ఈ వేదికపై మెగా నిర్మాత అల్లు అరవింద్ ఎంతో ఎమోషనల్ స్పీచ్ ని ఇచ్చారు. 

ఈ సందర్భంగా అల్లు అరవింద్ ఈ మూవీ గురించి ఎన్నో విషయాలు తెలిపారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, రాజమౌళి వంటి అతిరథులు వేదికపై ఉండగా, అరవింద్ మాట్లాడుతూ ఎవరికీ తెలియని ఓ విషయం చెబుతా వినాలని సభికులను కోరారు. ఆఖరికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు కూడా ఆ విషయం తెలియదని అన్నారు..దాంతో అందరూ ఆశ్చర్యంగా అల్లు అరవింద్ ముఖం వైపు చూశారు.. అదేంటంటే సైరా సినిమా చూసిన మొదటి ప్రేక్షకుడ్ని తానేనని వెల్లడించారు. చిత్ర యూనిట్ సభ్యులు కాకుండా తానొక్కడ్నే సైరా మొత్తం వీక్షించానని తెలిపారు. నిజానికి ఈ సినిమా చూసేటప్పుడు తాను ఎంతో భయం గా చూశానని, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు, ఎంతోకాలం తీశారు, ఎలా ఉంటుందో అని భయపడుతూ సినిమా చూశాననిన అన్నారు. 

ఇక మొత్తం సినిమా చూసి కిందపడిపోయానని, వెంటనే చిరంజీవిని హత్తుకుని సంతోషం వ్యక్తం చేశానని వివరించారు. సైరా సూపర్ హిట్ అని అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు.  కానీ ఒకసారి సినిమా చూశాక, ఎంతో అద్భుతంగా ఫీలయ్యాను అని, సినిమా చూశాక నాకు రామ్ చరణ్ పట్ల ఒక ఫీలింగ్ కల్గిందని వ్యాఖ్యానించారు అల్లు అరవింద్.


మరింత సమాచారం తెలుసుకోండి: