నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టాడు త్రివిక్రమ్. ఈ సినిమాకు ముందే త్రివిక్రమ్ కు మాటల రచయితగా మంచి గుర్తింపు ఉంది. అతడు, జల్సా సినిమాలు హిట్ అవటంతో దర్శకునిగా కూడా త్రివిక్రమ్ కు వరుసగా అవకాశాలొచ్చాయి. వరుస విజయాలు అందుకుంటున్న త్రివిక్రమ్ కు ఖలేజా రూపంలో ఫ్లాప్ వచ్చింది. కానీ జులాయి సినిమా హిట్ కావటంతో త్రివిక్రమ్ మరలా ఫామ్ లోకి వచ్చాడు. 
 
జులాయి సినిమా తరువాత పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి అబవ్ యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. సన్నాఫ్ సత్యామూర్తి సినిమా తరువాత త్రివిక్రమ్ ప్రతి సినిమాను అ అనే అక్షరంతో మొదలు పెడుతున్నాడు. అ ఆ సినిమా నుండి అల వైకుంఠపురములో సినిమా వరకు త్రివిక్రమ్ ఇదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. 
 
అ ఆ, అజ్ఞాతవాసి, అరవిందసమేత వీరరాఘవ, అల వైకుంఠపురములో ఇలా ప్రతి సినిమాకు త్రివిక్రమ్ అ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ త్రివిక్రమ్ ఇదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. త్రివిక్రమ్ కెరీర్లో అ అక్షరంతో మొదలైన అతడు, అత్తారింటికి దారేది సినిమాలు కూడా అ అక్షరంతొ మొదలైనవే. ఒక్కో దర్శకుడు తమ సినిమాలకు ఒక్కో సెంటిమెంట్ ఫాలో అవుతారు. 
 
త్రివిక్రమ్ కూడా ఇదే విధంగా ఈ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడని చెప్పవచ్చు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తరువాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న అల వైకుంఠపురములో సినిమా 2020 సంక్రాంతి పండుగ సమయంలో విడుదల కాబోతుంది. అల్లు అర్జున్ కు జోడీగా పూజా హెగ్డే ఈ సినిమాలో నటిస్తోంది. టబు, మురళీ శర్మ, సుశాంత్, నివేదా థామస్ ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: