గోపీచంద్ హీరోగా నటిస్తున్న " చాణక్య" మరికొద్ది రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. గత కొన్ని రోజులుగా గోపీచంద్ కి సరైన విజయం దక్కలేదు. "చాణక్య" సినిమాపై గోపీ మంచి నమ్మకంతో ఉన్నాడు. ఈ సినిమాలో గడ్డం పెంచి విభిన్నమైన లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్ కి విశేష స్పందన లభించింది. అయితే ఈ సినిమా ఇంకా రిలీజ్ అవకుండానే తన తర్వాతి సినిమాని ప్రకటించేశాడు.


ఏమైంది ఈ వేళ సినిమాతో దర్శకుడి గా పరిచయమైన సంపత్ నంది దర్శకత్వంలో తన తర్వాతి చిత్రం చేయబోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన "గౌతమ్ నంద" అనుకున్నంత విజయం సాధించలేదు. అయినప్పటికీ సంపత్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు గోపీ చంద్. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఈ సినిమాలో ఇంకా ఎవరెవరు నటిస్తున్నారు, సాంకేతిక నిపుణులు ఎవరనేది ఇంకా తెలియలేదు.


సినిమాకి సంబంధించి ఇంకా ఎలాంటి విషయం బయటకి రాకపోయినప్పటికీ హీరోయిన్ ఎవరనేది మాత్రం ఒక క్లారిటీ వచ్చేసింది. సంపత్ నంది రామ్ చరణ్ తో తీసిన రచ్చ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అలాగే రవితేజతో తీసిన బెంగాల్ టైగర్ కూడా హిట్టే. అయితే ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది తమన్నా. అందుకే గోపీచంద్ తో తీసే సినిమాలో కూడా తమన్నానే తీసుకుందామని అనుకుంటున్నాడట.


తమన్నా నటించిన రెండు సినిమాలు విజయం సాధించడంతో సెంటిమెంట్ గా ఉంటుందని తమన్నాని ఎంచుకోనున్నారట. అయితే తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ హీరోగా నటించిన "సైరా" మూవీలో నటిస్తుంది. మరి సంపత్ నంది సెంటిమెంట్ ఈ సినిమాకు వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: