నిన్న హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో ఘనంగా జరిగిన సైరా రిలీజ్ ఈవెంట్ లో ఎంతో మంది అతిథులు వచ్చి సినిమాపై తమకున్న ప్రేమను మరియు చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని గౌరవాన్ని చాటుకున్నారు. వారిలో పవన్ కళ్యాణ్, రాజమౌళి, వి.వి.వినాయక్, జగపతిబాబు, అల్లు అరవింద్ ప్రముఖులు. అయితే అందరికన్నా సంచలన వ్యాఖ్యలు చేసింది మాత్రం అల్లు అరవిందే. పవన్ కళ్యాణ్ కూడా తెలియని ఒక విషయాన్ని సైరా గురించి వెల్లడించిన అల్లు అరవింద్ తర్వాత సినిమాపై చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు.

అల్లు అరవింద్ స్పీచ్ మొదలుపెట్టగానే వద్దంటూ మెగా అభిమానులు చేతులు అడ్డంగా ఊపటం కెమెరాలో కనపడింది. అయినా అల్లు అరవింద్ ఆగకుండా చిరంజీవిపై తనకున్న ప్రేమను.... అభిమానాన్ని చాటుకున్నాడు. సైరా సినిమా మొదట మీ అందరి కన్నా ముందు చూసింది నేనేనని… చిత్ర బృందం తప్ప ఈ సినిమా చూసిన మొట్ట వ్యక్తిగా నేను మొదట చాల నిరాశ పడ్డాను అని అల్లు అరవింద్ అన్నాడు. తను చిరంజీవితో ఎన్నో సినిమాలు తీశానని కానీ సైరా లాంటి ఒక మంచి యుద్ధవీరుడి నేపథ్యంలో చారిత్రాత్మక సినిమా చేయలేకపోయినందుకు ఒక పక్క నిరాశ పడినా... మరో పక్క రామ్ చరణ్ ఇంత గొప్ప సినిమా తీసినందుకు ఆనందపడ్డాను అని అరవింద్ అన్నాడు.

ఇకపోతే మొదటి ప్రింట్ చూసి సినిమా అయిపోగానే తాను నిలదొక్కుకోలేక ఒక్కసారిగా కింద పడి పోయాను అని… వెంటనే తేరుకుని పైకి లేచి చిరంజీవి గారిని గట్టిగా హత్తుకొని సినిమా చాలా బ్రహ్మాండంగా ఉందని... పక్కా హిట్ అని అన్నానని అల్లు అరవింద్ అన్నాడు. ఇంత మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులను మరియు బడ్జెట్ ను కంట్రోల్ చేయడం చాలా సులభమైన విషయం కాదని సురేందర్ రెడ్డి మరియు రామ్ చరణ్ ను అభినందిస్తూ అల్లు అరవింద్ తన స్పీచ్ ను ముగించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: