మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గద్దలకొండ గణేష్, మూడు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ టాక్ ని సంపాదించిన విషయం తెలిసిందే. హీరో వరుణ్ తేజ్, తన కెరీర్ లో తొలిసారి గద్దలకొండ గణేష్ అనే మాంచి మాస్ క్యారెక్టర్ లో నటించి అటు మెగాఫ్యాన్స్ తో పాటు ఇటు సాధారణ ప్రేక్షకులను కూడా ఎంతో మెప్పించారు. ఇటీవల తమిళ్ లో రిలీజ్ అయి మంచి హిట్ కొట్టిన జిగర్తాండ సినిమాకు అధికారిక రీమేక్ గా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు హరీష్, 

తనదైన మాస్ మరియు కమర్షియల్ అంశాలను జోడించి ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని, ప్రేక్షకులు ఆయనపై ప్రశంశలు కురిపిస్తున్నారు. కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని హరీష్ కి, ఈ సినిమా విజయం మంచి జోష్ ని ఇచ్చిందనే చెప్పాలి. ఇక రిలీజ్ అయి ఇప్పటికే మూడు రోజులు గడిచిన ఈ సినిమా, ఇప్పటివరకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలిపి రూ.13.5 కోట్ల షేర్ ని దక్కించుకున్నట్లు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇది ఇప్పటివరకు వరుణ్ కెరీర్ లోని వచ్చిన సినిమాలన్నింటిలోకి ది బెస్ట్ అని కూడా వారు అంటున్నారు. 

అయితే మొదట్లో ఓవర్సీస్ లో కాస్త స్లో గా ముందుకు సాగిన ఈ సినిమా, ప్రస్తుతం అక్కడ కూడా డీసెంట్ గానే కలెక్షన్లని రాబడుతున్నట్లు చెప్తున్నారు. వరుణ్ తేజ్ సరసన శ్రీదేవి అనే పాత్రలో నటించిన పూజ హెగ్డే కూడా ఆడియన్స్ నుండి మంచి మార్కులు సంపాదించింది. సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ అందించిన సాంగ్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు, కెమెరా మ్యాన్ ఆయనంక బోస్ అందించిన ఫోటోగ్రఫీ ఈ సినిమాకు అతి పెద్ద అసెట్ గా చెప్పుకోవాలి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ నుండి తోలి ప్రయత్నంగా వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం సూపర్ హిట్ దిశగా పయనిస్తూ ఉండడంతో, నిర్మాతలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: