సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సందడి నెలకొంది. సంక్రాంతిని టార్గెట్ చేసుకుని ఇప్పటికే కాలా సినిమా షూటింగ్ లు జరుగుతున్నాయి. కాగా రాబోయే సంక్రాంతికి టాలీవుడ్ ఇండస్ట్రీ బాక్స్ఆఫీస్ దగ్గర టఫ్ ఫైట్ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు అల్లు అర్జున్ సినిమాలు సంక్రాంతిని టార్గెట్ చేసుకుని ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న తరుణంలో...సినిమా విడుదల విషయంలో పెద్దగా గ్యాప్ లేకుండా రెండు సినిమాలు విడుదల అవుతున్నాయి. స్టైలిష్ స్టార్, అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల.. వైకుంఠపురములో' అనే సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.


మరోపక్క సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నారు. అయితే ఇద్దరు హీరోలు చేస్తున్న సినిమాలు హ్యాట్రిక్ ని టార్గెట్ గా చేసుకుని విడుదలవుతున్నట్లు ఫిలింనగర్లో వార్తలు వినపడుతున్నాయి. ఎలాగంటే త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నటించిన గత రెండు సినిమాలు అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్నాయి. దీంతో ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న అల.. వైకుంఠపురములో అనే సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని బన్నీ ఆలోచిస్తున్నాడు. ఇదే తరుణంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రెడీ అవుతున్నాడు.


వరుసగా 'భరత్ అనే నేను', 'మహర్షి' సినిమా లతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో హ్యాట్రిక్ కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. అయితే మహేష్ సినిమా కంటే రెండు రోజుల ముందే అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జనవరి 12న చిత్ర యూనిట్ సినిమా రిలీజ్ తేదీని ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిత్ర యూనిట్ విదేశాల్లో మరో షెడ్యూల్ ని స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతోంది. మొత్తంమీద రాబోయే సంక్రాంతికి మహేష్ నటించిన 'సరిలేరు నీకెవ్వరు' కంటే ముందే అల్లు అర్జున్ నటించిన ‘అల.. వైకుంఠపురములో’ అనే సినిమా విడుదల కాబోతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: