‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముగిసిపోవడంతో ఇప్పుడు చరణ్ దృష్టి ఈ మూవీ ప్రమోషన్ ను అత్యంత భారీగా దేశ వ్యాప్తంగా చేసే విషయమై అనేక మీడియా సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఈ మూవీ ప్రమోషన్ ఈ వెంట్స్ చెన్నై బెంగుళూరులతో పాటు ముంబాయిలో కూడ నిర్వహించబోతున్నారు. 

ఈ మూవీకి అత్యంత భారీ స్థాయిలో బిజినెస్ అయిన నేపధ్యంలో ఈ మూవీ బయ్యర్లు లాభ పడాలి అంటే ఈ మూవీకి అన్ని ప్రాంతాలలోను భారీ ఓపెనింగ్స్ రావాలి. తెలుగు రాష్ట్రాలలో చిరంజీవికి ఉన్న మ్యానియా రీత్యా ఈ మూవీ ఓపెనింగ్స్ పై ఎటువంటి సందేహాలు లేకపోయినా ఉత్తరాది ప్రాంతానికి చెందిన హిందీ బెల్ట్ లో ఈ మూవీ ఎలాంటి ఓపెనింగ్స్ తెచ్చుకోగాలుగుతుంది ఈ మూవీ కలక్షన్స్ రికార్డులు ఆధారపడి ఉంటాయి.

ఈ వాస్తవాలను గ్రహించిన రామ్ చరణ్ ఉత్తరాది ప్రాంతంలో ఈ మూవీకి మ్యానియా తీసుకు రావడానికి ప్రభాస్ సహకారం కోరినట్లు టాక్. ఒక ప్రముఖ హిందీ ఛానల్ ‘సైరా’ ప్రసారం చేసే రెండు ప్రత్యేక కార్యక్రమాలను ప్రభాస్ చరణ్ తో కలిసి హోస్ట్ చేయడానికి అంగీకరించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. 

‘సాహో’ ఫలితం ఎలా ఉన్నప్పటికీ నేషనల్ సెలెబ్రెటీగా ప్రభాస్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ‘సైరా’ మూవీ గురించి అదేవిధంగా చిరంజీవి గొప్పతనం గురించి కొన్ని మంచి మాటలు చెపితే బాలీవుడ్ ప్రేక్షకులు సులువుగా కనెక్ట్ అవ్వడమే కాకుండా ఉత్తరాది ప్రాంతంలో ‘సైరా’ కు మ్యానియా ఏర్పడుతుందని చరణ్ మాష్టర్ ప్లాన్ అని అంటున్నారు. ‘సాహో’ నిర్మాణ సమయంలో ఆ మూవీని నిర్మించిన యువీ క్రియేషన్స్ నిర్మాతలకు అనుకోని ఇబ్బందులు వచ్చినప్పుడు చరణ్ భారీ మొత్తాన్ని వారికి ఇచ్చి సహాయం చేసాడు అని అంటారు. ఇప్పుడు ప్రభాస్ ఈ విధంగా ఆ రుణాన్ని తీర్చుకుంటున్నాడు అనుకోవాలి..  




మరింత సమాచారం తెలుసుకోండి: