ఇదిలా ఉంటే తమిళ నాడు లో మాత్రం ఒరిజినల్ వెర్షన్ కాప్పాన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. మూడు రోజుల్లో ఈ చిత్రం అక్కడ 23కోట్లగ్రాస్ వసూళ్లను రాబట్టి బ్లాక్ బాస్టర్ విజయం దిశగా పయనిస్తుంది. సూర్య అభిమానులకు ఇది సంతోషం కలిగించే విషయమే.. సూర్య కు తమిళం లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం అలాగే కాప్పాన్కు అక్కడ పాజిటివ్ టాక్ రావడంతో ఈచిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్లతో సత్తా చాటుతుంది. దాంతో ఈ చిత్రం సూర్య కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన చిత్రం గా రికార్డు సృష్టించింది. రంగం ఫేమ్ కేవీ ఆనంద్ డైరెక్షన్ లో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సయేశా సైగల్ కథానాయికగా నటించగా మోహన్ లాల్ , ఆర్య , బోమన్ ఇరానీ ముఖ్య పాత్రల్లో నటించారు . భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈచిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం అందించాడు.