లక్ష్మి మంచు వ్యాఖ్యాత గా చాలా ఫేమస్. ఆమె చాలా షో లకు వ్యాఖ్యాతగా వ్యవహరించి అందరితో శభాష్ అనిపించుకుంది. ప్రస్తుతం , VOOT అనే యాప్ కోసం రూపొందించిన షో కి వ్యాఖ్యాత గా వ్యవహరిస్తుంది.ఈ షో పేరు" ఫీట్ ఆఫ్ విత్ స్టార్స్" . అయితే ఈ షో సెట్ లో జరుగదు బెడ్ రూమ్ లో జరుగుతుంది.
ఈ వారం గెస్ట్ గా మెగా హీరో వరుణ్ తేజ్ వచ్చాడు.నీహారిక సినీ ఇండస్ట్రి కి వస్తుందని తెలిసినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు అన్న ప్రశ్నకు వరుణ్ ఈ విధంగా సమాధానం చెప్పాడు.మొదట కొంచెం సంకోచించాను .కానీ మా కుటుంబం నుండి దాదాపు 7 గురు హీరోలు వచ్చినపుడు ఆమె ను ఆపడం కరెక్ట్ కాదు అనిపించింది.నీహారిక దగ్గరికి వెళ్ళి సినిమా అంటే అంతా ఈజీ గా ఉండదు.నువ్వు చాలా కష్టపడాల్సి ఉంటుంది అని చెప్పాను. నీహారిక హీరోయిన్ అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.
సినిమాల్లోకి వచ్చిన తరువాత ఎవరైనా అభిమాని నిన్ను కంగారు పెట్టారా అన్న ప్రశ్నకు ఒక సారి నా ఫ్రెండ్స్ తో క్లబ్ కి వెళ్లాను. నన్ను ఎవరో అమ్మాయి వెనుక నుండి పట్టుకుంది. నేను నా ఫ్రెండ్ కావచ్చు అనుకున్న కానీ చూస్తే నా ఫ్రెండ్స్ అందరు నా ముందు ఉన్నారు. సడెన్ గా వెనక్కి తిరుగాను ఆ అమ్మాయి నా బుగ్గ మీద ముద్దు పెట్టి పారిపోయింది. అప్పుడు కొంచెం భయమేసింది
రాశీ ఖన్నా సాయి పల్లవి, పూజా హెగ్డే లో ముగ్గురులో నువ్వు కిల్, మ్యారి. హుక్కప్ ఎంచుకోవాలి అని అడిగినపుడు. సాయి పల్లవిని పెళ్లి చేసుకుంటాను, పూజా హెగ్డే తో హుక్కప్ చేస్తాను.రాశీ ఖన్నా ను కిల్ చేస్తాను అని చెప్పాడు. ఈ షో మొత్తం సరదాగా సాగింది.గద్దలకొండ గణేష్ సినిమా హిట్ టాక్ తో మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.