మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ హిస్టారికల్ మూవీ సైరా నరసింహారెడ్డి. తొలి తరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు తన కెరీర్లో ఇటువంటి పాత్ర పోషించలేదని, స్వతంత్ర సమరయోధుడైన నరసింహారెడ్డి గారి పాత్రలో నటించడం తనకు నిజంగా ఒక ఛాలెంజ్ గా అనిపించిందని, అయితే ఆ ఛాలెంజ్ ని తాను ఎంతో సాదరంగా స్వీకరించి, ఆ పాత్రకు నా వంతు కష్టపడి మెరుగులు దిద్దానని, 

నిన్న జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి చెప్పడం జరిగింది. మెగాస్టార్ సరసన నయనతార తొలిసారి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రూ.250 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మంచి పాన్ ఇండియా ఫీల్ తో తెరక్కించడం జరిగింది. అందుకే ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు వాయిస్ ఓవర్ అందించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, 

సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలకు కూడా తన వాయిస్ ని అందించినట్లు చెప్పారు నిర్మాత రామ్ చరణ్. అయితే టీజర్ రిలీజ్ తరువాత, పవన్ సినిమాలోని కొన్ని సీన్స్ కి కూడా వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుందని తాను భావించానని, ఇక అందుకు పవన్ అంగీకరించడంతో, సినిమాలోని తొలి సీన్ అలానే ఆఖరి సీన్లకు పవన్ తన గాత్రాన్ని అందించారని నిన్నటి ఫంక్షన్ లో చిరంజీవి చెప్పారు. అంటే దీనిని బట్టి సైరా తెరపై మెగాస్టార్ ని చూస్తూ, వెనుకనుండి వచ్చే పవర్ స్టార్ వాయిస్ ని ఎంజాయ్ చేయొచ్చన్నమాట. ఈ విధంగా మెగా ఫ్యాన్స్ కి డబుల్ బొనాంజా లభించినట్లవుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: