సినిమాలే కాదు ఈమధ్య రియాలిటీ షోస్.. సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ కూడా బాలీవుడ్ స్టైల్ ను ఫాలో అవుతున్నారు మనవాళ్లు. ఇప్పటికే తెలుగు మీడియా నేషనల్ మీడియాకు పోటీ ఇస్తుండగా లేటెస్ట్ గా బాలీవుడ్ సూపర్ హిట్ షో తెలుగులో మొదలు పెడుతుండటం మరోసారి హాట్ న్యూస్ గా మారింది. ఫీట్ అప్ విత్ స్టార్స్ బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చాట్ షో.


సెలబ్రిటీస్ బెడ్ రూం సీక్రెట్స్ ను బెడ్ రూం లోనే అడిగి తెలుసుకునే షో. తెలుగులో ఈ షోని హోస్ట్ చేస్తున్నారు మంచు లక్ష్మి. ఇక ఈ వారం ఫీట్ అప్ విత్ స్టార్స్ లో గద్దలకొండ గణేష్ తో స్పెషల్ చిట్ చాట్ చేశారు మంచు లక్ష్మి. రీసెంట్ గా తన సినిమా రిలీజై సూపర్ సక్సెస్ అవడంతో ఎలాంటి ప్రమోషన్స్ ను వదిలిపెట్టడం లేదు వరుణ్ తేజ్.


కోలీవుడ్ మూవీ జిగుర్ తండా రీమేక్ గా వచ్చిన ఈ సినిమాను హరీష్ శంకర్ డైరెక్ట్ చేశారు. మంచు లక్ష్మి షోలో భాగంగా వరుణ్ తేజ్ ను మూడు క్రేజీ క్వశ్చన్స్ అడగడం జరిగింది. రాశి ఖన్నా, పూజా హెగ్దె, సాయి పల్లవి ఈ ముగ్గురిలో ఎవరితో డేటింగ్ చేస్తారు..? ఎవరిని పెళ్లి చేసుకుంటారు..? ఎవరిని చంపేస్తారు..? అని అడిగారు.


అయితే దీనికి ఏమాత్రం ఆలోచించకుండా పూజా హెగ్దెతో డేటింగ్.. సాయి పల్లవితో పెళ్లి అని చెప్పిన వరుణ్ తేజ్ రాశి ఖన్నాని చంపేస్తానని అన్నారు. పూజా హెగ్దెతో వరుణ్ తేజ్ ముకుంద, గద్దలకొండ గణేష్ రెండు సినిమాల్లో నటించారు. సాయి పల్లవితో ఫిదాతో హిట్ అందుకున్నారు. ఈ ఇద్దరితో ఒకరితో డేటింగ్, ఒకరితో పెళ్లి అన్న వరుణ్ ఎందుకు రాశి ఖన్నాని చంపేయాలని అన్నారో అర్ధం కాలేదు.


వరుణ్ తేజ్, రాశి ఖన్నా కలిసి తొలిప్రేమ సినిమాలో నటించారు. అయితే పైకి అలా చెప్పినా రాశి ఖన్నా కూడా వరుణ్ తేజ్ కు చాలా క్లోజ్ అని తెలుస్తుంది. ఆమె మీద అభిమానం కొద్ది వరుణ్ అలా చెప్పాడని అంటున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. తన తర్వాత ప్రాజెక్ట్ ఏంటన్నది ఇంకా వెళ్లడించలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: