తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 ఎనిమిదవ వారం దాటింది. ఇంటి సభ్యులు ఇప్పటి వరకు చిన్న చిన్న గిల్లి కజ్జాలు మినహా పెద్దగా గొడవ పడ్డ దాఖలాలు లేవు. కాకపోతే అప్పుడప్పుడు ఇంటి సభ్యుల మద్య జరుగుతున్న వివాదాలు మాత్రం టివిలో చూపించి వీక్ ఎండ్ కి నాగార్జున వచ్చి వారికి క్లాస్ పీకడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇంటి నుంచి హేమ, జాఫర్,తమన్నా,రోహిణి,అర్షు,అలీ రజా, హిమజ వెళ్లారు. అయితే రాహూల్ శనివారం ఎలిమినే అయి ఇంటి నుంచి వెళ్లిపోయాడు..కానీ నిన్న అందరికీ ట్విస్ట్ ఇస్తూ తిరిగి ఇంట్లోకి అడుగు పెట్టాడు. ఇక నిన్నటి ఎపిసోడ్ ఇప్పటి వరకు ఇంటి సభ్యుల మద్య ఉన్న స్నేహ సంబందాలను ప్రశ్నించే విధంగా ఉంది.
ఇంటి సభ్యుల జంటగా ఏర్పడి బిగ్ బాస్ లో తాము ఎందుకు ఉండాలి...ఫినాలేకి ఉండాల్సిన అర్హత గురించి చెప్పే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ నేపథ్యంలో శ్రీముఖి-శివజ్యోతి కి మద్య జరిగిన వాదన మామూలుగా లేదు..రచ్చ రచ్చ చేశారు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నారు..వీక్ పాయింట్స్ గురించి ఎత్తి చూపించుకున్నారు..ఇలా ఇద్దరి మద్య వాదన తీవ్ర స్థాయిలోకి వెళ్లింది.
మొత్తానికి ఈ వాదనలో ఇంటి సభ్యులు అడిగిన ప్రశ్నలకు శివజ్యోతి మంచి సమాధానం ఇవ్వడంతో ఈసారి ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంది..దాంతో శ్రీముఖికి ఎండుమిర్చి దండ వేసింది. తర్వాత వితిక, రవికృష్ణ జోడిలో వితిక గెలిచింది..రాహూల్,వరుణ్ తేజ్ జోడీలో రాహూల్ గెలిచాడు..చివరిగా పునర్నవి-భాబా భాస్కర్ మద్య వాదన నడుస్తుంది..వీరిద్దరు కూడా నువ్వా నేనా అనే విధంగా వాధించుకుంటున్నారు..ఒకదశలో పునర్నవి బాబా బాస్కర్ పై షాకింగ్ కామెంట్స్ కూడా చేసింది. ఈరోజు వీరిద్దరిలో ఎవరు విన్ అవుతారో చూడాలి.