మంచు లక్ష్మి హోస్ట్ చేస్తున్న టాక్ షో ఫుట్ అప్ విత్ స్టార్స్’ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే సమంతతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మంచు లక్ష్మి తన రెండవ టాక్ షోను వరుణ్ తేజ్ తో నిర్వహించింది. 

ఈ కార్యక్రమంలో ఆమె అనేక చిలిపి ప్రశ్నలు అడుగుతూ వరుణ్ తేజ్ ను ఇరుకున పెట్టడానికి ప్రయత్నించింది. ఆమె ప్రశ్నలకు సరైన స్థాయిలో సమాధానాలు ఇస్తూ వరుణ్ తేజ్ తాను 10వ క్లాస్ చదువుకుంటున్న సమయంలోనే ఒక అమ్మాయికి ముద్దు పెట్టిన విషయాన్ని బయట పెట్టాడు. 

ఇదే సందర్భంలో మంచు లక్ష్మి సాయి పల్లవి పూజ హెగ్డే రాశి ఖన్నా ఈ ముగ్గురులో ఎవర్ని పెళ్ళి చేసుకుని మరెవరితో డేటింగ్ చేస్తావు అని అడిగిన ప్రశ్నకు వరుణ్ తేజ్ షాకింగ్ రిప్లయ్ ఇచ్చి అందరి మైండ్స్ ను బ్లాంక్ చేసాడు. తాను సాయి పల్లవిని పెళ్ళి చేసుకుని పూజ హెగ్డేతో డేటింగ్ చేస్తానని రాశి ఖన్నాను మాత్రం చంపేస్తానని జోక్ చేస్తూ తన మనసులోని మాటను బయట పెట్టాడు.

ఇప్పటికే సాయి పల్లవిని పెళ్లి చేసుకుంటాను అంటూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక ప్రముఖ రాజకీయ వేత్త కొడుకు ప్రయత్నాలు చేసిన వార్తలు తెలిసినవే. ఇప్పుడు ఈ లిస్టులో వరుణ్ తేజ్ కూడ చేరిపోయాడు అనుకోవాలి. అయితే సాయి పల్లవి మూడ్స్ తట్టుకుని నటించడం హీరోలకే కష్టం అయిపోతున్న నేపధ్యంలో వరుణ్ తేజ్ సాయి పల్లవి భర్తగా భరించగలడా ఊహకందని ప్రశ్న. వరుణ్ తేజ్ కి ఒక పారిశ్రామిక వేత్త కుమార్తెతో పెళ్ళి జరగవచ్చు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ మెగా హీరో ఇలా తన మనసులోని మాటను బయట పెట్టడం షాక్ ఇచ్చే విషయం..


మరింత సమాచారం తెలుసుకోండి: