నందమూరి బాలయ్య బాబు ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో ఓ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. మొన్నటి వరకు రాజకీయాల్లో బిజీ బిజీగా ఉండటం అంతకుముందు తండ్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను రెండు భాగాలుగా చిత్రీకరించి పరాజయం పాలు కావడంతో చాలా గ్యాప్ తీసుకుని బాలయ్య బాబు... కె.ఎస్.రవికుమార్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రజెంట్ ఆ సినిమా షూటింగ్ లో చాలా బిజీగా బాలయ్య బాబు మారిపోయాడు. ఇదిలా ఉండగా గతంలో బాలయ్య బాబుతో పైసా వసూల్ సినిమా చేసి నందమూరి అభిమానులను నిరుత్సాహ పరిచిన డైరెక్టర్ పూరి జగన్నాథ్...ఎలాగైనా బాలయ్య బాబుకి సినిమా హిట్ అవడానికి తాజాగా రెడీ అయిపోయినట్లు ఫిలింనగర్లో వార్తలు వినపడుతున్నాయి.


కాగా గతంలో పైసా వసూల్ సినిమా రిలీజ్ అవ్వకముందే బాలయ్య బాబు కచ్చితంగా పూరిజగన్నాథ్ తో మరో సినిమా చేస్తానని మాట ఇవ్వటం జరిగింది. ఈ క్రమంలో ఇటీవల పూరి జగన్నాథ్ బాలయ్య బాబు కి అదిరిపోయే పోలీస్ క్యారెక్టర్ కలిగిన స్టోరీ రెడీ చేశాడట. అంతేకాకుండా ఆ స్టోరీ నీ బాలయ్య బాబు కి వినిపించాడట. స్టోరీ విన్న బాలయ్య బాబు కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ చేద్దామని పూరి జగన్నాథ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలింనగర్లో వార్తలు వినపడుతున్నాయి. అయితే అధికారికంగా మాత్రం ఈ వార్త ఎక్కడ కూడా బయటికి రాలేదు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో చేయబోయే ప్రాజెక్టుపై దృష్టిసారించారు. ఈ ప్రాజెక్టు ఈ ఏడాది చివరిలో మొదలయ్యి సమ్మర్ కల్లా పూర్తి చేయాలి పూరి జగన్నాథ్ భావిస్తున్నాడట.


ఈలోపు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య బాబు చేయబోయే సినిమా కూడా కంప్లీట్ అవ్వటం ఖాయం దీంతో ఆ తర్వాత వెంటనే పూరితో బాలయ్య బాబు సినిమా చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా పూరి జగన్నాథ్ తన హీరోలను పోలీస్ క్యారెక్టర్ లో చూపించిన సినిమాలు చాలావరకు ఇండస్ట్రీ హిట్ అందుకున్నాయి. మరి బాలయ్య బాబు తో చేయబోయే ఈ పోలీస్ క్యారెక్టర్ సినిమా ఎటువంటి హిట్ అందుకుంటుందో చూడాలి. అయితే వీరిద్దరి కాంబినేషన్ గురించి ఈ సినిమా గురించి అధికారికంగా మాత్రం ఈ వార్త బయటకు రాలేదు. ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా బాలయ్యతో పూరి జగన్నాథ్ సినిమా చేయనున్నట్టు టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: