బాలక్రిష్ణ, పవన్ కళ్యాణ్ టాలీవుడ్ అగ్ర హీరోలు చిత్రమేంటంటే ఈ ఇద్దరు హీరోలు కూడా రాజకీయాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. అయితే బాలయ్య ఎమ్మెల్యేగా ఉంటూ సినిమాలు వరసగా చేస్తూ వస్తున్నారు. పవన్ ది అలా కాదు, జనసేన పార్టీకి ఆయనే కర్త కర్మ క్రియ. అందువల్ల పార్టీని గాడిన పెట్టేవరకూ సినిమాల వూసు వద్దనుకున్నారు. ఈ ఇద్దరు నటులకు మాస్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఇద్దరి సినిమాలకు మాగ్జిమం గ్యారంటీ కూడా ఉంది.


ఇపుడు ఈ ఇద్దరి నటుల కాల్షీట్ల కోసం బాలీవుడ్ అగ్ర నిర్మాత, ఆలిండియా సూపర్ స్టార్ దివంగత శ్రీదేవి భర్త అయిన బోనీ కపూర్ ట్రై చేస్తున్నారని టాక్. బాలీవుడ్లో మంచి హిట్ కొట్టిన పింక్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని బోనీకపూర్ అనుకుంటున్నారు. బోనీ తెలుగులో మూవీస్ వరసగా తీయాలని రెడీ అవుతున్నారట. ఈ క్రమంలో బాలీవుడ్ రీమేక్ తో తెలుగులో సత్తా చాటాలన్నది ఆయన ఆలోచంగా ఉంది. పింక్  మూవీ తమిళంలో కూడా మంచి హిట్ కావడంతో పాటు  అజిత్, శ్రధ్ధ శ్రీనాధ్ లకు మంచి పేరు తెచ్చిపెట్టింది.


అటువంటి ఈ  మూవీలో లాయర్ పాత్ర చాలా కీలకంగా ఉందిట. ఈ పాత్ర పోషించాలంటే బాలయ్య, పవన్ ఇద్దరు మాత్రమే సరిపోతారని అంటున్నారు. ఈ ఇద్దరూ ప్రజా జీవితంలో కూడా ఉండడంతో హైప్ క్రియేట్ అవుతుందని భావిస్తున్నారు. బోనీ ఈ ఇద్దరి డేట్స్  కోసం ట్రై చేస్తున్నట్లుగా చెబుతున్నారు. పవన్ విషయానికి వస్తే ఆయన సినిమాలు చేయనని అంటున్నారు. అయితే ఆయన్ని ఒప్పించాలని అనుకుంటున్నారుట.


ఒకవేళ ఆయన ససేమిరా అంటే మాత్రం బాలయ్య డేట్స్ తీసుకుని అయినా మూవీని తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తున్నారుట. బాలయ్య ఇపుడు కేఎస్ రవి కుమార్ మూవీలో నటిస్తున్నారు. శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది.ఈ మూవీ తరువాత్ పింక్ మూవీలో బాలయ్య నటిస్తారని అంటున్నారు. అదే జరిగితే చాన్నాళ్ళ తరువాత బాలయ్య ఓ రీమేక్ మూవీకి ఓకే చెప్పినట్లు అవుతుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: