భారత దేశ స్వాతంత్ర్యం కోసం తెలుగు ప్రాంతానికి చెందిన వారిలో మొట్టమొదటిగా దేశం కోసం పోరాడిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి మరియు నిర్మాత రామ్ చరణ్ కలిసి 'సైరా' సినిమా చేయడం జరిగింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటించారు. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘సైరా’ సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్క్రీన్ లలో రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఇటీవల హైదరాబాద్ నగరంలో ఎల్బీ స్టేడియంలో మెగా అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు రాజమౌళి మరియు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరై అద్భుతంగా ప్రసంగించడం జరిగింది.


దీంతో ఇప్పుడు ఈ సినిమాపై అభిమానుల్లో చర్చ మొదలైంది. ఒక్కసారిగా సినిమాపై క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా ట్రైలర్ తో ఒక్కసారిగా సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబందించిన సెన్సార్ రివ్యూ పూర్తి చేసుకున్న నేపథ్యంలో సినిమాలో ఓ ట్విస్టు ఉన్నట్లు ఆ ట్విస్టు సినిమాకే హైలెట్ సీన్ అంటూ ప్రచారం జరుగుతోంది. 


అదేమిటంటే...ఈ సినిమాలో కీ విలన్ జగపతిబాబు అని, అది ప్రీ క్లైమాక్స్ లో రివీల్ అవుతుందని అంటున్నారు. అప్పటిదాకా చిరంజీవితో స్నేహంగా నటించి, ద్రోహానికి ఒడకొట్టే పాత్ర ఇదని అంటున్నారు. ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో జగపతిబాబు వీరారెడ్డి పాత్రలో ప్రేక్షకులను మెప్పించనున్నారు. సైరా నరసింహారెడ్డితో కలిసి ఆంగ్లేయుల మీద యుద్ధానికి దిగిన వ్యక్తి పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు.చిరునే రివీల్ చేసారు. అయితే, ఆయన పాత్రలో భిన్న కోణాలుంటాయని చిరుగా తాజాగా చెప్పడంతో ఈ పాత్రపై మరింత ఇంట్రస్ట్ ఏర్పడింది. మొత్తం మీద సైరా సినిమా అదిరిపోయే స్టోరీతో ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: