ఆగస్టు నెల 30వ తేదీన విడుదలైంది ప్రభాస్ సుజీత్ కాంబినేషన్లో వచ్చిన సాహో సినిమా. విడుదలకు ముందు ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడినా ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి నెగిటివ్ టాక్ వచ్చింది. 125 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సాహో సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 85 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. సాహో సినిమా డిస్ట్రిబ్యూటర్లకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. 
 
ప్రభాస్ తరువాత సినిమా జాన్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. ఈ సినిమా గురించి కొన్ని షాకింగ్ నిజాలు ఫిల్మ్ నగర్ వర్గాల నుండి తెలుస్తున్నాయి. 1960 పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇంటెన్సిటీ ఉన్న లవ్ స్టోరీ అని సమాచారం. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉండదని తెలుస్తోంది. ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే ఈ సినిమాలో నటిస్తోంది. 
 
సాహో సినిమా నిర్మాతలకు నష్టాలు రావటంతో ప్రభాస్ జాన్ సినిమాకు ఆర్థికంగా సమస్యలు ఏర్పడ్డాయని వెబ్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. కానీ ప్రభాస్ జాన్ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ తో పాటు గోపీకృష్ణ,బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారని సమాచారం. ఈ సినిమాకు దాదాపు 180 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుందని సమాచారం. 
 
యూరప్ లో ఈ సినిమా షూటింగ్ జరగబోతుందని తెలుస్తుంది. ప్రభాస్ ఈ సినిమాలో ఆస్ట్రాలజర్ గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ప్రభాస్ తో రెండు సినిమాల్లో కలిసి నటించిన కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో స్పెషల్ పాత్రలో కనిపించబోతుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా 25 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుందని సమాచారం అందుతుంది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: