పెళ్ళి.. పెళ్ళి తర్వాత అంటు మన సాప్రదాయలకు భారతదేశంలోనే కాదు అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలలోను ఎంతో గౌరవముంది. ప్రపంచం మొత్తం తెలుగు భాషకే మన భారతీయ సాంప్రదాయాలకు కట్టుబడి ఉండేవాళ్ళు ఇంతకముందు. కానీ రాను రాను అన్నీ చోట్ల అవన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. పెళ్ళికంటే ముందే సహజీవనం అంటు ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. ఇష్టముంటే పెళ్ళి చేసుకోవచ్చు..లేదంటే ఇద్దరికి కుదిరినన్ని రోజులు సరదాగా సహజీవనం చేసి తర్వాత ఎవరిదారి వాళ్ళు వెతుక్కోవచ్చు. అదేంటి అంటే మా ఇద్దరికి కుదరడంలేదు అందుకనే విడిపోయామనే విచిత్రమైన స్టేట్‌మెంట్ ఇచ్చేస్తున్నారు. ఇదంతా ఎందుకంటే ప్రముఖ హీరోయిన్ ఎమీ జాక్సన్ పెళ్ళి కాకుండానే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 

తమకు మగబిడ్డ పుట్టినట్టు ఎమీ జాక్సన్ స్వయంగా ప్రకటించింది. కొడుకు పేరును ఆండ్రెస్ గా ప్రకటించింది. 27 ఏళ్ల ఎమీ జాక్సన్ కొన్నాళ్లుగా జార్జ్ పనయోటుతో డేటింగ్ చేస్తోంది. ఈ క్రమంలోనే అనుకోకుండా గర్భం దాల్చానని గతంలోనే ప్రకటించిన ఎమీ, ఇప్పుడు మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పెళ్లి మాత్రం వచ్చే ఏడాది చేసుకోబోతున్నారని ఎమీ-జార్జ్ ప్రకటించారు. ఈ విషయం వినడానికి విచిత్రంగా, వింతగా ఉన్నా తప్పదు మరి. సెలబ్రిటీస్ ఇలానే ఉంటారు. రజనీకాంత్ తో చేసిన 2.ఓ తర్వాత మళ్లీ సినిమాలకు కమిట్ అవ్వలేదు ఎమీ జాక్సన్. పూర్తిగా బాయ్ ఫ్రెండ్ తో ప్రైవేట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తు ఉండిపోయింది. 

ఈ క్రమంలో తను ప్రెగ్నెంట్ అయ్యాననే విషయాన్ని స్వయంగా ప్రకటించిన ఎమీ.. అందుకు సంబంధించిన ఫొటోల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ సంచలం అవుతూనే ఉంది. ఈ ఏడాది జనవరి 1న జాంబియాలో ఎమీ-జార్జ్ ఎంగేజ్ మెంట్ జరిగింది. వచ్చే ఏడాది గ్రీస్ లోని ఓ అందమైన దీవిలో ఈ జంట పెళ్లి చేసుకోబోతోంది. ఇక బిడ్డకు జన్మనిచ్చిన సందర్భంగా బాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన ఎంతోమంది ప్రముఖులు ఎమీకి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఇక శంకర్ దర్శకత్వం వహించిన రెండు సినిమాలలో ఎమీ జాక్సన్ నటించడం విశేషం. అందులో చియాన్ విక్రం నటించిన 'ఐ' కాగా మరో సినిమా రజనీకాంత్ తో చేసిన 2.ఓ అన్న విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: