టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించారు. మెగాస్టార్ తో తన సొంత నిర్మాణ సంస్థ లో హిస్టరీ రికార్డ్స్ ని రూపొందించారు. తెలుగులో ప్రసిద్ధ నిర్మాతగా దశాబ్ధాల పాటు ఉన్న ఆయన తెలుగు సినీ పరిశ్రమకు అత్యంత ప్రముఖులు. బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో నిర్మించిన గజిని సినిమాతో ముంబై పరిశ్రమలోనూ నిర్మాతగా సక్సస్ అయ్యారు. అలాంటి పెద్ద నిర్మాతకే ఒక హీరోయిన్ చమటలు పట్టిస్తోందట. ఈమె పేరు చెబితే  నిద్రలో కూడా కలవరించే పరిస్థితి వచ్చిందని లేటెస్ట్ టాక్. 

పాన్ ఇండియా క్రేజు అంతకంతకు రెట్టింపవుతున్న సందర్భంలో అల్లు అరవింద్ జాతీయ స్థాయిలో ఓ భారీ చిత్రానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రామాయణం పేరుతో మైథలాజికల్ ని నిర్మించేందుకు సన్నాహల్లో ఉన్నారు. నిర్మాత మధు మంతెనతో కలిసి అరవింద్ ఈ చిత్రాన్ని దాదాపు 600కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాముడి పాత్ర కోసం హృతిక్ రోషన్ ని .. రావణాసురుడి పాత్ర కోసం ప్రభాస్ ని సంప్రదించారని కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక సీత పాత్ర కోసం దీపిక అయితే సరిగ్గా సరిపోతుందని నిర్మాతలు అనుకున్నారు.

కానీ దీపిక కాదనడంతో ఆ స్థానంలో శ్రద్ధాకపూర్ ని సంప్రదించారట. సాహో సినిమాతో శ్రద్ధ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయిన సంగతి అందరికి తెలిసిందే. ఇక గత ఏడాది బాలీవుడ్ లో చేసిన స్త్రీ వంద కోట్ల క్లబ్  లో చేరడంతో శ్రద్ధ భారీగా పారితోషికాల్ని డిమాండ్ చేస్తోంది కూడా. అందులో భాగంగానే రామాయణం 3డిలో నటించడానికి ఏకంగా 10-11 కోట్లు డిమాండ్ చేసిందని తాజా సమాచారం. శ్రద్ద డిమాండ్ చేసిన రెమ్యునిరేషన్ కు అల్లు అరవింద్ షాకయ్యారని లేటేస్ట్ న్యూస్. హీరోయిన్ కే ఈ స్థాయిలో రెమ్యునిరేషన్ ఇస్తే మరి హీరోకు ఎంత కేటాయించాలి అన్న డైలమా మొదలైందట. ఇక ఈ సినిమాకి దంగల్ ఫేమ్ నితీష్ తివారితో పాటు ప్రముఖ కెమెరామెన్.. మామ్ దర్శకుడు రవి ఉద్యవార్ సంయుక్తంగా దర్శకత్వం వహించనున్నారు. 3డీలో తెరకెకీంచబోతున్న ఈ సినిమాని త్వరలోనే సెట్స్ మీదకు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: