అడివి శేష్, ప్రస్తుతం ఈ పేరు టాలీవుడ్ చిత్ర సీమలో విరివిగా మరు మ్రోగుతోంది. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన సొంతం అనే సినిమాలో అతి చిన్న క్యారెక్టర్ తో టాలీవుడ్ కి నటుడిగా రంగప్రవేశం చేసిన శేష్, ఆ తరువాత అక్కడక్కడా కొన్ని సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించడం జరిగింది. అనంతరం తానే స్వయంగా హీరోగా కర్మ అనే సినిమాను కూడా తీశారు శేష్. అయితే ఆ సినిమా ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. అయినప్పటికీ తనలోని కసి, పట్టుదలతో కొన్ని సినిమాల్లో విలన్ పాత్రల్లో కూడా నటించిన శేష్, 

తొలిసారి తన నటనతో పాటు రచయిత గా కలానికి కూడా పదును పెట్టి పివిపి బ్యానర్ లో చేసిన సినిమా క్షణం. చిన్న సినిమాగా రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకున్న ఆ సినిమా తరువాత శేష్ కు టాలీవుడ్ లో మంచి పేరు లభించింది. ఇక ఆ సినిమా ఇచ్చిన మంచి ఊపుతో తదుపరి గూఢచారి అనే సినిమా కథకు రచన చేసి, తానే మళ్ళి హీరోగా నటించి మరొక సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు శేష్. ఇక ఇటీవల ఎవరు అనే క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ తో మరొక విజయాన్ని అందుకున్న శేష్, ప్రస్తుతం గూఢచారి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న గూఢచారి2 లో నటిస్తున్నారు. 

మొదటి భాగాన్ని మించి ఈ రెండవ భాగం మరింతగా ఆడియన్స్ ని ఆకట్టుకుని ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేస్తుందని, అలానే తనతో పాటు యూనిట్ మొత్తానికి దీనితో మరింత మంచి పేరు రావడం ఖాయం అని అంటున్నారు శేష్. ఇకపోతే దీని తరువాత మహేష్ బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంతో తెరకెక్కనున్న మేజర్ అనే సినిమాలో శేష్ టైటిల్ రోల్ లో నటిస్తున్నారు. 26/11 ముంబై ఎటాక్ లో దేశం కోసం అశువులు బాసిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను శశికిరణ్ తెరకెక్కించనున్నారు......!! 


మరింత సమాచారం తెలుసుకోండి: