ఇప్పటి  సినిమా ఇండస్ట్రీకి ఒకప్పటి సినిమా ఇండస్ట్రీలో చాలా తేడాలు ఉన్నాయి.  ఇప్పటి హీరోలు ఒకరి సినిమాను ఒకరు ప్రమోషన్ చేసుకుంటూ.. ఒకరి ప్రమోషన్  వేడుకలకు మరొకరు హాజరవుతూ అందరిని కలుపుకు పోతున్నారు.  కానీ, ఒకప్పుడు అలా ఉండేది కాదు.  ఎవరి దారి వారిదే అన్న రీతిగా ఉండేవారు.  పైగా ఫ్యాన్స్ కూడా అలాగే ఉండేవారు.  ముఖ్యంగా మెగా, నందమూరి అభిమానుల మధ్య పోటీ ఎలా ఉండేదో వారి సినిమాల మధ్య కూడా పోటీ అలానే ఉంటుంది.  


అయితే, ఓ సినిమా మాత్రం ఈ ఇద్దరు స్టార్స్ ను కలిపింది.  ఇద్దరు కలిసి సినిమాకు పనిచేయలేదు కానీ, ప్రమోషన్ విషయంలో సహకరించుకున్నారు.  ఆ సినిమా ఎదో కాదు ఆదిత్య 369 సినిమా.  సైన్స్ ఫిక్షన్ సినిమాగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో పెద్దలనే కాదు చిన్న పిల్లలను కూడా బాగా ఆకట్టుకుంది.  ఈ సినిమా బంపర్ హిట్ అయ్యింది.  ఈ మూవీ రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించిన తరువాత ఇంకా కొంచం ప్రమోషన్ చేయాలని దర్శక నిర్మాతలు భావించారు.  


ఇప్పట్లో మాదిరిగా అప్పుడు ఛానల్స్ లేవు.  దూరదర్శన్ ద్వారా మాత్రమే ప్రమోషన్ చేయాలి.  లేదంటే పేపర్లో యాడ్ వేయాలి.  సింగీతం శ్రీనివాసరావు, నిర్మాతలు అలోచించి నిర్ణయం తీసుకున్నారు.  మెగాస్టార్ తో ఈ సినిమాకు సంబంధించిన ఓ యాడ్ ను తీయాలని అనుకున్నారు.  అనుకున్నట్టుగా మెగాస్టార్ ను కలిసి ఒప్పించి యాడ్ తీశారు.  సింగీతం శ్రీనివాసరావు కాబట్టి సినిమాకు ఒకే చేశారు.  


యాడ్ మంచి విజయం సాధించింది.  దూరదర్శన్ లో మంచిగా చూశారు.  అనంతరం సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.  భారీ హిట్ అయ్యింది.  ఎన్నో అవార్డులు కూడా గెలుచుకుంది ఆదిత్య 369.  ఇందులో టైమ్ మెషిన్ అనే ఓ సాధనాన్ని వినియోగించి సినిమాను తెరకెక్కించారు.  ఇప్పటిలా అప్పట్లో గ్రాఫిక్స్ లేవు.. వాటి గురించి పెద్దగా తెలియవు కాబట్టి సినిమాను జనాలు బాగా చూశారు.  అదే ఇప్పుడైతే ఎన్నిరకాల వంకలు పెట్టేవారో.  సినిమా విజయంలో మెగాస్టార్ కూడా భాగస్వామ్యం కావడం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: