మంగళ వారం జరిగిన ఎపిసోడ్ లో బాబా భాస్కర్ డబల్ గేమ్ ఆడుతున్నట్టు అనిపించాడు. తన మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానని చెప్పే బాబా భాస్కర్ ఆ మాట తప్పినట్టు కనబడ్డాడు. నామినేషన్ టైంలో తన నిర్ణయాత్మక ఓటు ద్వారా స్నేహితురాలైన శ్రీముఖిని సేవ్ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా శివజ్యోతిని నామినేట్ చేయడంతో శ్రీముఖితో పాటు, ఆమె అభిమానులు కూడా షాక్ తిన్నారు.


ఎందుకంటే హౌస్ లో చాలా రోజులుగా వీరిద్దరు స్నేహంగా ఉంటున్నారు. అలాంటిది శ్రీముఖిని కాదని శివజ్యోతిని సేవ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదే ప్రశ్నని వరుణ్ సందేశ్ అడుగుతాడు. అయితే వరుణ్ కి శివజ్యోతిని నామినేట్ చేయాలని ఉందని చెప్పిన విషయం తెలిసిందే. వరుణ్ అలా అడగ్గానే బాబా భాస్కర్, శ్రీముఖి మాట్లాడిన విధానం చాలా హార్ష్ గా ఉందని, సడెన్ గా శివజ్యోతి మీద అరిచిందని, అపుడు శివజ్యోతి కూడా పెద్దగా మాట్లాడటం స్టార్ట్ చేసిందని అందుకే శివజ్యోతిని సేవ్ చేశానని చెప్తాడు.


అయితే ఇదే ప్రశ్నని శ్రీముఖి అడిగినపుడు ఆమెకి వేరే సమాధానం చెప్తాడు. అప్పటికీ శ్రీముఖి నిజం చెప్పండి నేను కాంపిటీటివ్ స్పిరిట్ తో స్పోర్టివ్ గా తీసుకుంటానని చెప్తుంది. కానీ బాబా భాస్కర్ నువ్వు చాలా స్ట్రాంగ్ కంటెండర్ వి. నామినేషన్ లోకి వెళ్ళినా బయటపడగలవు అని చెప్తాడు. ఇక్కడే బాబా భాస్కర్ తప్పు చేసినట్లు తెలుస్తుంది.


వరుణ్ తో ఏ కారణమైతే  చెప్పాడో అదే కారణాన్ని శ్రీముఖితో చెప్తే బాగుండేదని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. బాబా భాస్కర్ ఇలా చేయడం వల్ల డబల్ గేమ్ ఆడుతున్నట్లుగా ఉందని అంటున్నారు. మరి బాబా భాస్కర్ ఇలా ఎందుకు చేశాడో ఆయనకే తెలియాలి. అసలే నామినేషన్ లో ఉన్న బాబా భాస్కర్ మీద దీని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: