నెక్స్ట్ షెడ్యూల్ లో జగపతి బాబు కూడా జాయిన్ కానున్నారు. భారీ బడ్జెట్ తో గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఆమె ఈ చిత్రంలో టీచర్ గా కనిపించనుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానున్న ఈ చిత్రానికి సైరా ఫేమ్ అమిత్ త్రివేది సంగీతం అందించే అవకాశాలు వున్నాయి. ఇక ఇదిలా ఉంటే దాదాపు రెండు ఏళ్ళ విరామం తరువాత సాహో తో ఇటీవల ప్రేక్షకులముందుకు వచ్చిన ప్రభాస్ కు ఆచిత్రం షాక్ ఇచ్చింది.
భారీ అంచనాల మధ్య గత నెలలో విడుదలైన ఈ చిత్రం తెలుగు తోపాటు తమిళ ,మలయాళం లో డిజాస్టర్ ఫలితాన్ని చవిచూసింది. అయితే హిందీ వెర్షన్ మాత్రం 150 కోట్ల వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ అయ్యింది. ఈచిత్రంతో ప్రభాస్ అక్కడ మరింతగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పర్చుకున్నాడు. దాంతో జాన్ కూడా తెలుగు తోపాటు హిందీలోనూ విడుదలకానుంది