టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి కిలాడీ కృష్ణుడు అనే సినిమాతో తెరంగేట్రం చేసిన విజయశాంతి, కెరీర్ తొలినాళ్లలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత వస్తున్న అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకుని అంచలంచలుగా పైకి ఎదిగిన విజయశాంతి గారు, అనతికాలంలోనే మంచి పేరున్న హీరోయిన్ గా మారి, అప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించారు. అయితే అప్పట్లో ఆమె కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేయడం జరిగింది. కర్తవ్యం, ఆశయం వంటి సినిమాలు విజయశాంతికి లేడీ అమితాబ్, లేడీ సూపర్ స్టార్ అనే బిరుదులు తెచ్చిపెట్టాయి. 

ఆ తరువాత నుండి కాస్త మెల్లగా సినిమాలు చేస్తూ వచ్చిన విజయశాంతి గారు, అప్పటి తెలంగాణ పోరాట నేపథ్యంలో తల్లితెలంగాణ పార్టీని నెలకొల్పి రాజకీయాల్లో ప్రవేశించడం జరిగింది. అయితే ఆ తరువాత తన పార్టీని టిఆర్ఎస్ లో విలీనం చేయడం జరిగింది. అనంతరం కొన్నాళ్ళు అదే పార్టీలో ఉన్న విజయశాంతి గారు, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే మధ్యలో చాలా ఏళ్ళ పాటు పూర్తిగా సినిమాలకు దూరమైన ఆమె, ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సరిలేరు నీకెవ్వరు అనే సినిమా ద్వారా మళ్ళి నటిగా టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో విజయశాంతి ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. 

అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, విజయశాంతి గారు తన తదుపరి సినిమాను కూడా ఓకె చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల వెంకీ, వరుణ్ తేజ్ ల కలయికలో వచ్చిన ఎఫ్2 సినిమాకు సీక్వెల్ గా రానున్న ఎఫ్3 సినిమాలో ఆమె నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడి, సరిలేరు నీకెవ్వరు షూటింగ్ సమయంలో ఆమెకు ఎఫ్3 స్టోరీ చెప్పడం, అందులోని ఒక మంచి క్యారెక్టర్ ని అఫర్ చేయడం జరిగిందట. అయితే అందుకు విజయశాంతి కూడా ఒప్పుకున్నారని అంటున్నారు. కాగా పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ న్యూస్ పై అధికారిక ప్రకటన మాత్రం వెలువడవలసి ఉంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: