ఇందుకోసం విజయ్ ఏకంగా 5కోట్ల రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నాడని సమాచారం. మరి ఈ రేంజ్ లో మైత్రి, రెమ్యునరేషన్ ఇస్తుందంటే విజయ్ పాత్ర లో ఏదో స్పెషల్ వుండే ఉంటుంది. ఇటీవలే విజయ్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో వైష్ణవ్ కు జోడీగా కృతి శెట్టి నటిస్తుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. విజయ్ సేతుపతి ఉండండంతో ఉప్పెన ను తమిళంలో కూడా విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక విజయ్ సేతుపతి కి తెలుగులో ఇది రెండో చిత్రం. ఆయన,మెగాస్టార్ చిరంజీవి నటించిన పీరియాడికల్ మూవీ సైరా తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు ఈచిత్రంలో విజయ్ ఓ కీలక పాత్రలో నటించాడు. అక్టోబర్ 2న ఈచిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.