ప్రస్తుతం  సౌత్ లోనే అత్యంత బిజీయెస్ట్ ఆర్టిస్టుల్లో ఒకరు  తమిళ నటుడు విజయ్ సేతుపతి.   అటు హీరోగా , విలన్ గా నటిస్తూ  తన దైన ముద్ర వేస్తున్నారు.  విజయ్ డేట్స్ దొరకాలంటే అంత  ఈజీ కాదు.  అయితే  తమ సినిమా కోసం ఈ నటుడ్ని  భారీ పారితోషికం  ఇస్తామని ఒప్పించి విలన్ పాత్ర కు తీసుకున్నారు మైత్రి మూవీ మేకర్స్.  ఇంతకీ ఆ సినిమా ఏంటేంటే  ఉప్పెన.   సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు  వైష్ణవ్ తేజ్ హీరోగా   ప్రముఖ దర్శకుడు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన  బుచ్చిబాబు సాన ఈ  చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం గ్రాండ్ గా లాంచ్ కాగా  ప్రస్తుతం శరవేగంగా  షూటింగ్ జరుపుకుంటుంది. జాలర్ల నేపథ్యంలో  తెరకెక్కతున్న ఈచిత్రంలో  విజయ్ సేతుపతి  విలన్ రోల్ లో నటిస్తున్నాడు. 



ఇందుకోసం  విజయ్  ఏకంగా  5కోట్ల రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నాడని సమాచారం.  మరి ఈ రేంజ్ లో మైత్రి,  రెమ్యునరేషన్ ఇస్తుందంటే  విజయ్ పాత్ర లో ఏదో స్పెషల్ వుండే ఉంటుంది.  ఇటీవలే విజయ్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో వైష్ణవ్ కు జోడీగా  కృతి శెట్టి  నటిస్తుంది.  వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.  విజయ్ సేతుపతి ఉండండంతో ఉప్పెన ను తమిళంలో కూడా విడుదలచేయడానికి  సన్నాహాలు చేస్తున్నారు.  



ఇక విజయ్ సేతుపతి కి తెలుగులో ఇది రెండో చిత్రం. ఆయన,మెగాస్టార్  చిరంజీవి  నటించిన  పీరియాడికల్ మూవీ  సైరా తో  తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు  ఈచిత్రంలో విజయ్  ఓ కీలక పాత్రలో నటించాడు. అక్టోబర్ 2న  ఈచిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: