తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్, నేడు సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ అకాల మరణం పొందారు. కొన్నాళ్లుగా కిడ్నీల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వేణు మాధవ్, ఇటీవల డయాలసిస్ చేయించుకుని డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లారు. అయితే కేవలం రెండు రోజుల తరువాత మళ్ళి ఆయనకు ఆరోగ్యం మరింత విషమించడంతో రెండు రోజుల క్రితం ఆయనను మళ్ళి అదే ఆసుపత్రిలో జాయిన్ చేసారు కుటుంబ సభ్యులు. ఇక నేడు పరిస్థితి మరింత విషమించడంతో మరణించినట్లు చెప్తున్నారు డాక్టర్లు. 

ఇకపోతే సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా వచ్చిన సంప్రదాయం అనే సినిమాతో నటుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన వేణు మాధవ్, ఆ తరువాత తన టాలెంట్ తో కమెడియన్ గా అవకాశాలు సంపాదించడం జరిగింది. అయితే టాలీవుడ్ లో వేణుమాధవ్ కు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మధ్య మంచి మిత్రత్వం ఉంది. అంతేకాక అప్పట్లో పవన్ హీరోగా వచ్చిన చాలా సినిమాల్లో వేణుమాధవ్ నటించడం జరిగింది. ఇకపోతే నేడు వేణుమాధవ్ మరణంతో ఎంతో దిగ్బ్రాంతి చెందిన పవన్ కళ్యాణ్, తన ఆవేదనను ఒక ప్రకటన రూపంలో తెలియచేసారు. తాను హీరోగా నటించిన గోకులంలో సీత సినిమా నుండి తనకు వేణుమాధవ్ గారితో మంచి అనుబంధం ఉందని, 

ఆ తరువాత నాతో కలిసి పలు సినిమాల్లో నటించిన ఆయన, ఇటీవల అనారోగ్యం పాలైన విషయం తెలిసి, వారు త్వరగా కోలుకుంటారు అని అనుకున్నాను. కానీ ఇంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని పవన్ తన ప్రకటనలో తెలిపారు. ఆయన ఎక్కడ ఉంటె అక్కడ ఎంతో సందడి వాతావరణం నెలకొని ఉంటుందని, అలానే రాజకీయాల పై కూడా వేణుమాధవ్ గారికి మంచి అవగాహనా ఉందని పవన్ తెలిపారు. నేడు మనల్ని వదిలి దూరంగా వెళ్ళిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆలనా ఆ భగవంతుడు వారి కుటుంబానికి గుండె ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ పవన్ తన జనసేన పార్టీ తరపున ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: