ప్రముఖ టాలీవుడ్ హాస్యనటుడు వేణుమాధవ్ ఈరోజు మృతి చెందారు. గత కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయనకు తమ సంతాపాన్ని తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంద్ర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వేణు మాధవ్ మృతి పట్ల సంతాపం తెలియజేశారు. 


కాగా సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, దర్శుకుడు సురేందర్ రెడ్డి, హీరో సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నితిన్, బ్రహ్మాజీ,  దర్శకుడు వంశి, గోపీచంద్ సంతాపం తెలియజేశారు. కాగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. కాగా తెలుగు దేశం పార్టీ ఆఫీస్ బాయ్ గా పని చేసిన వేణు మాధవ్ తన మిమిక్రి టాలెంట్ తో తెలుగు తెరకు పరిచయమై ఎన్నో సినిమాల్లో తన స్టయిల్ లో కామెడీ చేసి ప్రజల ముఖాల్లో చిరునవ్వులు పూయించి తనకంటూ ఓ స్థానాన్ని దక్కించుకున్నాడు వేణు మాధవ్. 


మరింత సమాచారం తెలుసుకోండి: