ఇక ఈ సినిమా ఓవర్సీస్ హక్కులకు గాను నిర్మాతలు ఏకంగా 15కోట్ల వరకు కోట్ చేస్తున్నారని సమాచారం. మహేష్ కు యూఎస్ లో కూడా మంచి మార్కెట్ ఉండడం అలాగే అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఎఫ్ 2 అక్కడ భారీ గా కలెక్షన్స్ రాబట్టడంతో నిర్మాతలు వీరిద్దరూ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారు. ఒకవేళ ఇదే రేట్ కు కనుక అమ్మితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 4.5 మిలియన్ల వసూళ్లను రాబట్టాల్సివుంటుంది. మరి డిస్ట్రిబ్యూటర్లు అంత పెట్టి కొని రిస్క్ చేస్తారో లేదా చూడాలి. కామెడీ మరియు యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనుండగా ఆయనకు జోడిగా కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తుంది. వీరితో పాటు సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైమెంట్స్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , జి ఏం బి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 11న థియేటర్లలోకి తీసుకురానున్నారు.