సూపర్ స్టార్ మహేష్ బాబు-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో  తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు'.  ఈచిత్రం సెట్స్ మీదకు వెళ్ళినప్పటినుండి  పెద్దగా బ్రేక్ లేకుండా శరవేగంగా షూటింగ్  జరుపుకుంటుంది.  ప్రస్తుతం ఈసినిమా షూటింగ్  రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది.  ఈ షెడ్యూల్ కోసం అక్కడ 6 కోట్ల ఖర్చు తో కర్నూల్ లోని  ఫేమస్  ఫోర్ట్ కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్ ను నిర్మించారు.  నవంబర్  చివరి కల్లా ఈచిత్రంయొక్క షూటింగ్ ను పూర్తి చేయనున్నారు. 



ఇక ఈ సినిమా ఓవర్సీస్ హక్కులకు గాను  నిర్మాతలు ఏకంగా 15కోట్ల వరకు కోట్ చేస్తున్నారని సమాచారం.  మహేష్ కు యూఎస్ లో కూడా మంచి మార్కెట్ ఉండడం అలాగే అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఎఫ్ 2 అక్కడ  భారీ గా కలెక్షన్స్ రాబట్టడంతో  నిర్మాతలు వీరిద్దరూ క్రేజ్ ను  క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారు.  ఒకవేళ ఇదే రేట్ కు  కనుక  అమ్మితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్  కావాలంటే 4.5 మిలియన్ల వసూళ్లను రాబట్టాల్సివుంటుంది. మరి డిస్ట్రిబ్యూటర్లు అంత పెట్టి కొని రిస్క్ చేస్తారో లేదా చూడాలి.  కామెడీ మరియు యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనుండగా ఆయనకు జోడిగా  కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తుంది.  వీరితో పాటు సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తుంది.  రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైమెంట్స్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , జి ఏం బి ప్రొడక్షన్స్ సంయుక్తంగా  నిర్మిస్తున్నాయి.  ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 11న  థియేటర్లలోకి తీసుకురానున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: