నూతన హీరో వంశీ యాకసిరి, స్టెపీ పటేల్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు అనిల్ తోట తెరకెక్కిస్తున్న చిత్రం “నిన్ను తలచి”. నేదురుమల్లి ప్రొడక్షన్స్ బ్యానర్ పై నేదురుమల్లి అజిత్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఈనెల 27న విడుదల కానుంది. ఈ సందర్బంగా హీరో వంశీ మీడియా ముచ్చటించారు....
”నెల్లూరులో పుట్టిపెరిగిన నేను 2013 ఇండస్ట్రీకి రావడం జరిగింది. అప్పటినుండి దర్శకుడు అనిల్ తోటా గారితో పరిచయం ఉంది. గతంలో నేను కొన్ని సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ చేశాను. అనిల్ గారు నేను చేసిన ఈగిల్ అనే డెమో వీడియో ప్రొడ్యూసర్స్ ఓబులేష్ గారు మరియు అజిత్ కుమార్ గారికి నచ్చడంతో మా ఈ మూవీ కార్యరూపం దాల్చింది. పవన్ తొలిప్రేమ మూవీ స్పూర్తితో తెరకెక్కిన మా ఈ చిత్రం అభి మరియు అంకిత అనే ఓ జంట మధ్య నడిచే లవ్ డ్రామాగా తెరకెక్కించడం జరిగింది. సినిమాటిక్ గా కాకుండా మా మూవీ సహజంగా ఉంటుంది” అన్నారు. ప్రస్తుతం ఈ రోజుల్లో ఇలాంటి చిత్రాలు రావడం లేదని లవ్ ఎమోషన్స్, ఫీలింగ్స్ని చూపించే విధంగా రావడం లేదన్నారు. ఇందులో నేను ప్లేబాయ్ క్యారెక్టర్లో చేస్తున్నాను. ఓ అమ్మాయికి ప్రపోజ్ చెయ్యడం వారిద్దరి మధ్య కొన్ని ట్విస్టులతో కూడుకున్నదే ఈ సినిమా చివరికి వాళ్లు ఎలా కలుస్తారు. ఏంటి అన్న నేపధ్యంలో సాగుతుంది. నా నిజ జీవితంలో ఎలాంటి లవ్ స్టోరీస్ లేవు. మాది చాలా మధ్య తరగతి కుటుంబం. నా నెక్స్ట్ మూవీ కూడా ఇదే బ్యానర్లో అనిల్ తోటగారితో చేస్తున్నా. తమిళ్లో కనర్కాట్ అనే చిత్రంలో నటించాను. మొదట్లో అనిల్ తోటగారిదగ్గర డాన్స్ నేర్చుకునేవాడ్ని. నాకు పవన్ కళ్యాణ్గారంటే చాలా ఇష్టం. నాకు మా డైరెక్టర్గారికి ఇద్దరికీ ఆయనంటే అమితమైన అభిమానం. అలాగని సినిమాలో ఆయన్ని ఎక్కడా ఇమిటేట్ చెయ్యలేదు. అలాగే సినిమాలో ఒక్క చిన్న డైలాగ్ పెట్టాం. పవన్కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది వెళ్ళాలి అనే ఒక చిన్న డైలాగ్. రెండేళ్ళ నుంచి అనిల్తోటగారితో వర్క్ చేస్తున్నాను అని ముగించారు.