ప్రముఖ టాలీవుడ్ హాస్య నటుడు వేణుమాధవ్ నేడు అకాల మరణం పొందిన విషయం తెలిసిందే. గత కొద్దిరోజలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో సతమతమవుతున్న వేణుమాధవ్ కు ఇటీవల యశోద ఆసుపత్రిలో డయాలసిస్ జరిగింది. అయితే ఆ తరువాత కొంత కోలుకున్నాక ఆయనను ఇంటికి పంపారు డాక్టర్లు. కానీ మూడు రోజుల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయనను యశోద ఆసుపత్రికి తరలించారు. నిన్నటి నుండి వెంటిలేటర్ పై ఆయనకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, ఎంత కష్టపడినప్పటికీ ఆయన బ్రతకలేదు. చివరకు నేటి మధ్యాహ్నం వేణుమాధవ్ మనందరినీ విడిచి తిరిగిరానిలోకాలు వెళ్ళిపోయారు. 

వేణుమాధవ్ మృతితో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు సినిమా ప్రముఖులు ఆయనకు కన్నీటి వీడ్కోలు అందిస్తున్నారు. ఇకపోతే మరొక హాస్యనటుడు మరియు రచయితైన ఎల్బీ శ్రీరామ్, కాసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వేణుమాధవ్ కు ఒక హృద్యమైన పోస్ట్ ద్వారా కన్నీటి వీడ్కోలు పలికారు. ' నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా వేణూ,,,,ఆగు,,,కొంచెం నవ్వు ఇచ్చి వెళ్ళు, వచ్చాక ఇచ్చేస్తా' అంటూ అందరిని హృదయాలను కదిలించే పోస్ట్ చేసారు. ఇక ఈ పోస్ట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఎల్బీ శ్రీరామ్ గారు పెట్టిన ఆ పోస్ట్ వింటే ఎంతటివారికైనా కంట నీరు రాక మానదు. 

ఇప్పటికే చాలామంది కమెడియన్లు టాలీవుడ్ చిత్ర పరిశ్రమను వదిలి అనంత లోకాలకేగారు, వారి దారి లోనే వేణుమాధవ్ కూడా వెళ్లిపోవడంతో ఎల్బీ శ్రీరామ్ గారు ఎంతో బాధతో ఆ పోస్ట్ పెట్టినట్లు అర్ధం అవుతోంది. ఇకపోతే వేణుమాధవ్ పార్థివ దేహాన్ని రేపు మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో అభిమానుల సందర్శనార్ధం ఉంచనున్నారు. వేణుమాధవ్ మృతితో కన్నీటి పర్యంతం అవుతున్న ఆయన కుటుంబ సబ్యులకు పలువురు సినిమా ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: