గత రెండు వారాల నుండి బిగ్ బాస్ మూడవ సీజన్ బాగా పుంజుకుంది అనే చెప్పాలి. రాహుల్ ఎలిమినేషన్ ని ఫేక్ చేయడం, పునర్నవి మరియు రాహుల మధ్య మంచి కెమిస్ట్రీ క్రియేట్ చేయడం… హౌస్ మేట్స్ బంధువుల్ని పిలిచి వినూత్నమైన రీతిలో వారిని కలిసేలా చేయడం వంటివి ఎన్నో బిగ్ బాస్ హౌస్ లో చోటుచేసుకున్నాయి. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా ప్రతివారం కొత్త తరహాలో చేస్తున్న నిర్వాహకులు ఇప్పుడు టీ.ఆర్.పీ కోసం అదిరిపోయే స్టంట్ వేశారు. 

గత రెండు సీజన్లలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో హౌస్ లోకి ఇప్పటికే ఎలిమినేట్ అయిన ఒక క్యాండిడేట్ రేపు రీ-ఎంట్రీ ఇవ్వనున్నారు. హేమ, జాఫర్, ఆషు రెడ్డి, రోహిణి, తమన్నా, అలీ, హిమజ, శిల్ప చక్రవర్తి  ఇప్పటికే ఇంటి నుండి వెళ్లిపోగా వారిలో ఒకరికి మళ్ళీ లోపలికి వచ్చి తమని తాము నిరూపించుకునే అవకాశం బిగ్ బాస్ కల్పించాడు. ఆ వ్యక్తి ఎలిమినేషన్ దాదాపు అందరికీ ఆశ్చర్యం అనే చెప్పాలి. దురదృష్టకర రీతిలో ఎలిమినేట్ అయిన ఆ కంటెస్టంట్ రేపు రాబోయే అవకాశాన్ని రెండు చేతులు అందిపుచ్చుకుంటాడు అనే ప్రేక్షకులు ఆశిస్తున్నారు. అతనే 'యాంగ్రీ యంగ్ మాన్' అలీ రెజా.

మొదటి నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న అలీ మొదటి ఆరు వారాలలో అసలు నామినేట్ అవ్వలేదు. తర్వాత వారంలో పరిస్థితులు అన్నీ తనను పగ పట్టినట్టు దురదృష్టవశాత్తు ఊబిలో పడిన అలీ రెజా చివరికి అన్నీ తనకి ప్రతికూలంగా ఉండేసరికి ఇంటి నుండి వెళ్లిపోవాల్సి వచ్చింది. శ్రీముఖితో మంచి అనుబంధం ఉన్న అలీ ఇప్పుడు లోనికి వెళ్ళి కొంచెం బలహీనంగా కనపడుతున్న ఆమెనూ బలపరుస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అంకానికి చేరుకున్న ఈ సీజన్ లో ఫైనల్ లో కూడా మనం అలీ ని చూసే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా అలీ రెజా ఎంట్రీతో హౌస్ లో పరిస్థితులు భారీ గా మారబోతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: