ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హారర్ .. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ల టైమ్ బాగా నడుస్తోంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సస్పెన్స్ క్రియేట్ చేయగలిగితే చాలు కుర్చీ అంచు పైన కూర్చొని చూసేలా మిస్టరీని రన్ చేయగలిగితే సక్సెస్ పక్కా. ఆ తరహాలో మర్డర్ మిస్టరీ జోనర్ తో టాలీవుడ్ లో ఇంతకుముందు చాలా సినిమాలొచ్చాయి. ఇదే జోనర్ లో మరో కొత్త సినిమా రిలీజ్ కి సిద్దమవుతోంది.

రాగల 24 గంటల్లో అనే సినిమా టైటిల్ తో తెరకెక్కుతోంది. వార్తల్లో  వాతావరణం గురించి చెప్పినట్టే.. రాగల 24 గంటల్లో ఏం జరుగుతుందో ఈ సినిమాలో చూపిస్తారట. ఊహించని సంఘటనలతో ఎంతో ఆసక్తికరంగా ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాగ్డ్రాప్ లో రూపొందించారని తెలుస్తోంది. రాగల 24 గంటల్లో అనుకోని సంఘటనలు ఏవి? అసలు ఆ 24 గంటల్లో ఏం జరిగింది అనేది ఆసక్తికరంగా చూపించబోతున్నామని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు. అందుకు తగ్గట్టే టీజర్ లో మర్డర్ మిస్టరీని ఇంట్రస్టింగ్ గా చూపించారు. ఈ పాత్రలో ఇషారెబ్బా కరెక్ట్ గా సూటయిందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. అంతేకాదు మళ్ళీ ఈ సినిమాతో ఈషా మరో హిట్ ని తన ఖాతాలో వేసుకోబోతుందని తెలుస్తుంది. 

ఇన్నాళ్లు కామెడీ సినిమాలతో మెప్పించిన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మొదటిసారి థ్రిల్లర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.  తమిళ హీరో శ్రీరామ్ కీలక పాత్రలో నటిస్తుండగా చాలాకాలం తర్వాత ఫేమస్ కమెడియన్ కృష్ణభగవాన్ ఈ సినిమాలో కనిపించడం విశేషం. అక్టోబర్ నెలలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారట. సత్యదేవ్- ఈషా రెబ్బా- గణేష్ వెంకట్రామన్- ముస్కాన్ సేథీ ప్రధానపాత్రలు పోషించిన ఈ సినిమాను శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ సమర్పణలో శ్రీనివాస్ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీనివాస్ కానూరి నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాకి రఘు కుంచె సంగీతం .. భాస్కర భట్ల పాటలు అందించడం మరో ఆసక్తికరమైన విషయం. 



మరింత సమాచారం తెలుసుకోండి: