వరుణ్ తేజ్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ( వాల్మీకి ) గద్దలకొండ గణేష్. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ మంచి వసూళ్ళను రాబట్టింది. సోమ, మంగళ వారాలు కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి. బుధవారం మాత్రం కాస్త డీలా పడింది. అయితే రెండో వారం అస్సలు ఒక్క సినిమా కూడా థియోటర్స్ లోకి రావడం లేదు. సైరా వచ్చే వరకు ఈ సినిమా తప్ప ఇంకో సినిమా గద్దలకొండకు పోటీ లేదు. అందులోనూ మాస్ సినిమా కాబట్టి, కాస్తో కూస్తో షేర్ లాగుతుంది.. మెల్లగా బయ్యర్లు గట్టెక్కేస్తారు అని అనుకున్నారు అంతా. కానీ అలా జరిగేలా లేదని అర్థమవుతోంది.

అందుకు కారణం అనూహ్యంగా పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఇస్మార్ట్ శంకర్ ను అర్జెంట్ గా ఈ గురువారం నుంచి సెలెక్టెడ్ థియేటర్లలోకి రీ-రిలీజ్ చేస్తున్నారు. వందలాది థియేటర్లు అన్న లెక్క మాత్రం కాదు కానీ, పదుల సంఖ్యలో, మేయిన్ సిటీస్ లో సినిమాను విడుదల చేస్తున్నారు. పక్కా మాస్ సినిమా ఇస్మార్ట్ శంకర్. మాస్ సినిమా ప్రేక్షకులు రెండో సారి కూడా ఆసక్తిగా చూడగలిగే సినిమా. అటు వాల్మీకి కూడా మాస్ సినిమానే. అయితే రెండింటికీ పోటీ అంటే ఇస్మార్ట్ దే అప్పర్ హ్యాండ్ అవుతుంది. అందువల్ల రెండోవారం (వాల్మీకి) గద్దల కొండ గణేష్ సినిమా కలెక్షన్లను ఇస్మార్ట్ శంకర్ బాగానే దెబ్బతీసే అవకాశం వుంది. 

తక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నా, తొలి రోజు రెస్పాన్స్ బాగుంటే థియేటర్లు పెంచే ఆలోచనలో వున్నారు పూరి అండ్ ఛార్మీ. అదే కనుక జరిగితే రెండో వారం గణేష్ కలెక్షన్లను గట్టిగా ఎఫెక్ట్ ఇస్తుంది ఇస్మార్ట్ శంకర్. మరి పూరి ఎటు ఈ వారం మంచి సినిమా లేదు కాబట్టే మళ్ళీ రిలీజ్ చేసి ఇంకాస్త సంపాదించాలనా..లేక ఎదైనా కక్ష సాధింపు చర్యా అన్నది అంతుచిక్కడం లేదు. ఇక పూరి విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. అంతేకాదు బాలయ్య తో కూడా సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: